Ukraine Crisis: ‘సైన్యం మన కోసం చేయాల్సినంత చేస్తోంది.. కానీ శత్రువు చాలా క్రూరుడు’
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో రష్యా మరోసారి బాంబులతో విరుచుకుపడుతోంది. శనివారం ఉదయం కీవ్లోని డార్నిట్స్కీ జిల్లాలో వైమానిక దాడులు జరిపింది. .....
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో రష్యా మరోసారి బాంబులతో విరుచుకుపడుతోంది. శనివారం ఉదయం కీవ్లోని డార్నిట్స్కీ జిల్లాలో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఒకరు మృతిచెందగా.. అనేకమంది గాయపడినట్టు కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో వెల్లడించారు. ‘‘మనల్ని రక్షించేందుకు మన సైనిక బలగాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి.. కానీ శత్రువులు చాలా క్రూరులు, మోసగాళ్లు’ అని మండిపడ్డారు. కీవ్లోని సాయుధ వాహన కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా సేనలు పేర్కొనడంతో మరిన్ని దాడులు కొనసాగే అవకాశం ఉన్నందున బయట ఉన్న ఉక్రెయిన్ పౌరులెవరూ ఇప్పుడే కీవ్కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. రాజధాని నగరంపై ఇంకా దాడులు కొనసాగే అవకాశం ఉందంటూ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ ద్వారా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కీవ్పై మున్ముందు శత్రుదాడుల్ని కొట్టిపారేయలేమన్నారు. కీవ్లోకి ప్రజల రాకను నిషేధించలేమనీ.. కేవలం సిఫారసు మాత్రమే చేయగలమన్నారు. ఇప్పటికే వారు ఉన్నచోట సురక్షితంగా ఉండే అవకాశం ఉంటే మాత్రం అక్కడే ఇంకొంత కాలం ఉండాలని కోరారు.
మరోవైపు, ల్వీవ్ నగరంలోనూ రష్యా వైమానిక దాడులకు పాల్పడినట్టు ఆ ప్రాంత గవర్నర్ మాక్స్యమ్ కొజిత్స్కీ తెలిపారు. రష్యాకు చెందిన ఎస్యూ-35 విమానం బెలారస్లోని బరానోవిచి ఎయిర్ఫీల్డ్ నుంచి బయల్దేరి ల్వీవ్లో క్షిపణి దాడులు చేసిందన్నారు. అలాగే, ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాలుగు క్రూయిజ్ క్షిపణుల్ని కూల్చి వేసిందని చెప్పారు. అయితే, ఈ దాడుల్లో జరగిన నష్టానికి సంబంధించిన వివరాలను మాత్రం గవర్నర్ వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’