Petrol price in Srilanka: శ్రీలంకలో పెట్రోల్ డబుల్ సెంచరీ.. లీటర్ రూ.204 చేరిక!
శ్రీలంకలో చమురు ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది.
కొలంబో: శ్రీలంకలో చమురు ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. శనివారం ఒక్కరోజే పెట్రోల్పై లీటర్కు 20 రూపాయలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.204కు చేరింది. అలాగే డీజిల్ ధరను సైతం రూ.15 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) తెలిపింది. దీంతో డీజిల్ ధర రూ.139కి చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమని ఎల్ఐఓసీ పేర్కొంది.అయితే ఈ ధరలు శ్రీలంక కరెన్సీ శ్రీలంక రూపిలో ఉన్నాయి. భారత రూపాయితో పోలిస్తే శ్రీలంక రూపి విలువ రూ.2.69పైసలు.
శ్రీలంక ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. గత నెలలో ద్రవ్యోల్బణం ఏకంగా 25 శాతం పెరిగింది. దీంతో చమురు ధరలతో పాటు ఇతర నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన శ్రీలంకకు కొవిడ్ మహమ్మారి వల్ల గట్టి దెబ్బ తగిలింది. పర్యాటక రంగం కుదేలవ్వడంతో విదేశీ మారక విలువలు పూర్తిగా అడుగంటాయి. దీంతో గత వారం దేశానికి రవాణా అయిన చమురును కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితిని ఆ దేశం ఎదుర్కొంది. దీంతో చాలా పెట్రోల్ పంపుల వద్ద ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు దర్శనమిచ్చాయి. మరోవైపు శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. ఆహార పదార్థాలు, ఔషధాల దిగుమతి కోసం భారత్ను 1 బిలియన్ డాలర్ల రుణ సాయం కోరనున్నారు. ఇందులో 400 మిలియన్ డాలర్లను విదేశీ మారక నిల్వల లోటును భర్తీకి వినియోగించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ