Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభం.. ఖాళీ కానున్న డీజిల్ బంకులు..!
ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక, రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను చవిచూచే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత్ సహాయాన్ని భారీగా వినియోగించుకుంటున్న పొరుగుదేశం
కొలంబో: ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక.. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను చవిచూచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు పొంచి వున్నాయనే వార్తలు శ్రీలంక వాసులను వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో ఇంధన సంక్షోభం నుంచి గట్టేక్కిచేందుకు 500 మిలియన్ డాలర్ల విలువైన చమురును లైన్ ఆఫ్ క్రెడిట్గా భారత్ అందిస్తోంది. దీన్ని శ్రీలంక వేగంగా వినియోగించుకుంటోంది. మరికొన్ని రోజుల్లోనే ఇవి కూడా తరిగిపోనున్నాయి. ఒకవేళ భారత్ నుంచి ఈ సహాయం కొనసాగింపు పొందకపోతే ఏప్రిల్ నెలాఖరు నాటికి శ్రీలంకలో డీజిల్ బంకులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభంతో భారత్ ఇంధన సహాయాన్ని అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఇంధనం సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ.. అక్కడి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మార్చి చివరివారం నుంచే వాటి సరఫరా మొదలుపెట్టింది. ఏప్రిల్ 15, 18, 23 తేదీల్లో మరిన్ని దఫాల్లో శ్రీలంకకు ఇంధనం సరఫరా చేయనుంది. అయితే భారత్ చేస్తోన్న ఈ సాయం ఏప్రిల్ చివరి నాటికి కూడా సరిపోక పోవచ్చన్ని అంచనా. ఆ తర్వాత కష్టాలు గట్టెక్కాలంటే మరోసారి శ్రీలంక భారత్ సహాయం తీసుకోవాల్సిందే.
దేశవ్యాప్తంగా ప్రజా రవాణాతోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీలంకకు భారీ స్థాయిలో డీజిల్ అవసరం. అయితే, ఇంధన కొరత ఏర్పడడంతో ఇప్పటికే కొన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేశారు. దీంతో నిత్యం పది గంటలపాటు విద్యుత్ కోతలు తప్పడం లేదు. ఇక దేశంలో ఉన్న ఒకేఒక రిఫైనరీ కూడా పనిచేసే పరిస్థితుల్లో లేదు. దిగుమతులకు చెల్లింపులు చేయలేక గత నవంబరులో రెండుసార్లు మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పొరుగుదేశం శ్రీలంక.. భారత్ సహాయంపై ఆధారపడాల్సి వచ్చింది.
గార్మెంట్ రంగం కుదేలు..
అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ మార్కెట్లకు శ్రీలంక భారీ స్థాయిలో వస్త్రాలను ఎగుమతి చేస్తోంది. దేశ జీడీపీలో వీటి వాటా 6శాతం ఉందంటే అవి ఎంత కీలకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, విద్యుత్ కొరత వల్ల గార్మెంట్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటున్నట్లు పరిశ్రమ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గంటలపాటు కరెంటు కోతలతో చిన్నతరహా పరిశ్రమలు మూత పడుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై అధ్యక్షుడితో చర్చేందుకూ సిద్ధమయ్యాయి.
వేధిస్తోన్న ఔషధాల కొరత..
మరోవైపు దేశంలో నెలకొన్న సంక్షోభం వైద్యరంగంపైనా పడింది. ముఖ్యంగా అత్యవసర ఔషధాల కొరత శ్రీలంకను వేధిస్తోంది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాధారణ సర్జరీలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఔషధాలు, వైద్య పరికరాలతోపాటు రియేజెంట్ల కొరత ఏర్పడుతోందని శ్రీలంక మెడికల్ అసోసియేషన్ (SLMA) అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఇలా నిత్యం గంటలపాటు విద్యుత్ కోతలు, గ్యాస్, ఆహారంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల కొరత శ్రీలంక వాసులను వేధిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీస్థాయిలో నిరసనలు చేపడుతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే, ఈ నిరసనలు రాజకీయ ప్రేరేపితంగా పేర్కొంటోన్న ప్రభుత్వం.. అధ్యక్షుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంకకు సహాయాన్ని ప్రకటించిన భారత్.. ఇంధన కొనుగోలు కోసం 500మిలియన్ డాలర్ల రుణపరిమితిని అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?