డ్రంక్ అండ్ డ్రైవ్లో కారు దొరికితే ఉక్రెయిన్కు పార్శిల్!
లాత్వియా (Latvia) దేశ అధికారులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి విన్నూత్న రీతిలో శిక్ష విధిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారి వాహనాన్ని సీజ్ చేసి ఉక్రెయిన్ (Ukraine) సైన్యానికి అందజేస్తున్నారు.
రిగా: తాగి వాహనం నడుపుతూ (Drink and Drive) పట్టుబడితే.. కేసు నమోదు చేసి, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిని మరుసటి రోజు కౌన్సిలింగ్ రమ్మని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో దిరికితే వాహనం సీజ్ చేయడం, జరిమానా లేదా కొద్దిరోజుల జైలు శిక్ష విధిస్తారు. కానీ, ఉత్తర ఐరోపాలో బాల్టిక్ (Baltic) సముద్ర తీరంలో ఉన్న లాత్వియా (Latvia) దేశ అధికారులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి వినూత్న రీతిలో శిక్ష విధిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే.. వారి వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. అలా సీజ్ చేసిన వాహనాలను ఉక్రెయిన్ (Ukraine) సైన్యానికి అందజేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1,200 పైగా కార్లను అందచేసినట్లు వెల్లడించారు.
రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు 0.15 శాతం కన్నా ఎక్కువ ఉండి రెండు నెలల వ్యవధిలో ఒకటి కన్నా ఎక్కువసార్లు వాహనం నడుపుతూ పట్టుబడిన వారి వాహనాలను లాత్వియా పోలీసులు సీజ్ చేస్తారు. ఇలా పట్టుబడిన వాహనాలను జైడాట్ ఎల్వీ(Ziedot.lv) అనే ఎన్జీవో ద్వారా ఉక్రెయిన్ తరలిస్తున్నారు. వాటిని ఉక్రెయిన్ సైన్యం తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటుంది. ఈ ఎన్జీవో ఉక్రెయిన్ను సాయం అందించేందుకు ట్విటర్ కాన్వాయ్ (Twitter Convoy) పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
‘‘మా ఎన్జీవో ద్వారా ఉక్రెయిన్కు తరలిస్తున్న వాహనాలను చూస్తే దేశంలో ఇంత మంది తాగి వాహనాలను నడుపుతున్నారా? అని భయంగా ఉంది. ప్రజలు మద్యం తాగినంత సులువుగా సీజ్ చేసిన వాహనాలను విక్రయించలేరు. అందుకే, ఆ వాహనాలను ఉక్రెయిన్ అందజేయాలనే ప్రతిపాదనన ప్రభుత్వం ముందుకు తెచ్చాను. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో ఇప్పటి వరకు 1,200 పైగా కార్లను ఉక్రెయిన్ను తరలించాం’’ అని ట్విటర్ కాన్వాయ్ వ్యవస్థాపకుడు రినిస్ పోజ్నాక్స్ తెలిపారు.
లాత్వియా ప్రభుత్వ సమాచారం ప్రకారం గతేడాది సుమారు 4,300 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే.. వారిలో ఎక్కువ మంది ప్రమాదాలు చేశారట. గతంలో ఇలా సీజ్ చేసిన వాహనాలను వేలంలో విక్రయించేవారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ సాయంగా ఈ వాహనాలను ఉచితంగా ఆ దేశానికి అందజేస్తున్నట్లు లాత్వియా ఆర్థిక మంత్రి అర్విల్స్ అసెరాడెన్స్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం