United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు
యునైటెడ్ ఎయిర్లైన్స్లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి చెందిన విస్కీ బాటిల్లోని మద్యం చోరీకి గురైంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్లైన్స్కు ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మామూలుగా విమాన ప్రయాణికులు తమ సామాను పోయిందని, తారుమారైందని ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ తాజగా యునైటెడ్ ఎయిర్లైన్స్(United Airlines)లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి చెందిన విస్కీ బాటిల్లోని మద్యం చోరీకి గురైంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్లైన్స్కు ట్వీట్ చేశారు. వివరావల్లోకి వెళితే.. శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్ ఆంబ్లర్ ఇటీవల విమానయానం చేశారు. ఆయన తన బ్యాగులో ఖరీదైన విస్కీ బాటిల్ను తీసుకెళ్లారు. కానీ గమ్యస్థానం చేరుకున్నాక బ్యాగ్ను తెరచి చూడగా బాటిల్లోని మద్యంలో మూడింట ఒక వంతు మాయమయ్యింది. అమెజాన్ స్టోర్లో ఆ బాటిల్ ధర 449.95 ఫౌండ్లు(రూ.45,556). దీంతో ఆగ్రహానికి గురైన ఆయన బాటిల్ను ఫొటో తీసి ట్విటర్లో పోస్టు చేశారు. ఆ మద్యాన్ని బ్యాగేజ్ సిబ్బంది తాగేసి ఉంటారని ఆరోపించారు.
‘‘ఖరీదైన స్కాచ్ బాటిల్ను బ్యాగులో పెట్టాను. దాన్ని విమాన సిబ్బంది తనిఖీ చేశారు. గమ్యస్థానం చేరుకున్నాక బ్యాగు తెరచి చూస్తే మూడింట ఒక వంతు మద్యం మాయమయ్యింది. బ్యాగులో ఎటువంటి లీకేజీ కాలేదు. నేను దాన్ని సర్దినప్పుడు సీల్ చేసి ఉంది. కానీ ఇప్పుడు సీల్ తెరచి ఉంది. మద్యాన్ని బ్యాగేజ్ సిబ్బందే తాగేసి ఉంటారు’’ అని ఎయిర్లైన్స్ను టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కు యునైటెడ్ ఎయిర్లైన్స్ స్పందించింది. ఈ ఘటనపై క్షమాపణలు తెలియజేసి ఫిర్యాదు చేయమని కోరింది. ఈ ట్వీట్ చూసిన యూజర్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎక్కువ మంది ఆశ్చర్యపోయారు. ‘ఆ మద్యం మీరే తాగేసి డబ్బుల కోసం ఇలా నటించట్లేదని చెప్పటానికి రుజువు ఏముంది. ఈ విషయాన్ని నిరూపించడం చాలా కష్టం’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. విమాన ప్రయాణికులు తమ బ్యాగులు పోయాయని, తారుమారయ్యాయని తరచుగా ఫిర్యాదులు చేస్తున్నారు. గతేడాది ఇండిగో ప్రయాణికుడు తారుమారైన తన బ్యాగును కనిపెట్టడం కోసం ఏకంగా ఎయిర్లైన్స్ వెబ్సైట్ను హాక్ చేశాడు. తోటి ప్రయాణికుడి వివరాలను సేకరించి తన లగేజ్ను తిరిగి పొందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్