Liz truss: బ్రిటన్ ప్రధాని లిజ్ట్రస్ రాజీనామా
ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్(Britain)లో పరిస్థితులు తారస్థాయికి చేరాయి. తాజాగా బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్(Liz truss) రాజీనామా చేశారు.
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్(Britain)లో పరిస్థితులు తారస్థాయికి చేరాయి. తాజాగా బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్(Liz truss) రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్పై విజయం సాధించిన లిజ్ట్రస్ సెప్టెంబర్ 6న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కేవలం 45 రోజులే ఆ పదవిలో కొనసాగగలిగారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పాలించిన ప్రధాని లిజ్ కావడం గమనార్హం. పన్ను కోతలపై సెప్టెంబర్లో ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ వల్ల మార్కెట్లు కుదేలు కావడం, డాలర్తో పోలిస్తే పౌండ్ విలువ రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోవడం వంటి పరిస్థితులు పెద్ద తలనొప్పిగా మారాయి. దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి హోదాలో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి ట్రస్ బుధవారం పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మెర్ అయితే.. ‘‘ఆమె ఇంకా పదవిలో ఉన్నారెందుకు?’ అని ప్రశ్నంచగా.. ‘‘నేను ఎదురొడ్డి పోరాడే ధీరవనితను. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బరి నుంచి పారిపోయే దాన్ని కాదు’ అంటూ దీటుగా సమాధానం ఇచ్చిన మరుసటి రోజే లిజ్ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
బ్రిటన్ రాజుకు తెలియజేశా..
ఇటీవల లిజ్ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్ ఆ దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్పై ఒత్తిడికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె డౌనింగ్ స్ట్రీట్ బయట మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు. తీవ్ర ఆర్థిక, అంతర్జాతీయ అస్థితరత కొనసాగుతున్న సమయంలో తాను ప్రధాని పదవి చేపట్టానని చెప్పుకొచ్చారు లిజ్. ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధం కొనసాగిస్తుండటం యూరప్తో పాటు బ్రిటన్కు ముప్పుగా పరిణమించిందని.. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణింపజేసిందని ఆమె పేర్కొన్నారు.
తొలి నుంచీ యూటర్న్లు!
లిజ్ట్రస్ ప్రధానిగా పదవి చేపట్టిన తొలినాళ్లలోనే పలు నిర్ణయాలపై యూ టర్న్లు తీసుకుంటూ వచ్చారు. ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం పెను దుమారం రేపింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామలపై ఇటీవల స్పందించిన ఆమె తాము చేసిన తప్పిదాలకు క్షమించాలని కూడా కోరారు. తాను ఎక్కడికీ వెళ్లనని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ కన్జర్వేటివ్ పార్టీ నేతగానే కొనసాగుతానని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లిజ్ ట్రస్పై ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో అంతకుముందే ఆమె తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
అక్టోబరు 7నాటి హమాస్ దాడుల విషయంలో నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. -
చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!
చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది. -
దాడి భారీగానే చేశాం కానీ.. ఇజ్రాయెల్కు జరిగింది స్వల్ప నష్టమే
ఇజ్రాయెల్పై ఇరాన్ భారీస్థాయిలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్కు మాత్రం స్వల్ప నష్టమే జరిగింది. ప్రయోగించిన 300కి పైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు పెద్దగా ప్రభావం చూపలేదు. -
కడుపుకోతల యుద్ధం
యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు
అమెరికాలోని మెంఫిస్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక పార్కులో జరుగుతున్న ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో ఇద్దరు మరణించారు. -
మాకు పురుగుల బియ్యం పంపుతున్నారు
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. -
అసాధారణ వాతావరణ పోకడలు ఇక సర్వసాధారణం!
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమని తెలిపింది. -
సముద్రంలో కుప్పకూలిన రెండు హెలికాప్టర్లు
జపాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో కుప్పకూలిపోయాయి. -
యుద్ధం ‘తల్లి’ ప్రాణం తీస్తే.. వైద్యులు ‘గర్భస్థ శిశువు’కు ఊపిరిపోశారు!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 మంది చిన్నారులను ప్రాణాలు కోల్పోయారు. -
పురుగుల బియ్యం.. పాకిస్థాన్కు రష్యా వార్నింగ్!
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు రావడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో దిగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం