Liz Truss: ప్రధానిగా 45 రోజులే అయినా.. జీవితాంతం.. ఏడాదికి రూ.కోటి భత్యం
ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్.. బ్రిటన్లో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు. అయినప్పటికీ తదనంతరం ప్రభుత్వం నుంచి ప్రతిఏటా సుమారు రూ.కోటి భత్యాన్ని పొందేందుకు అర్హత సాధించారు. వివాదాస్పద నేతగా రాజీనామా చేసిన ఆమెకు ఈ భత్యాన్ని ఇవ్వవద్దనే వాదన బ్రిటన్లో మొదలయ్యింది.
లండన్: సంపన్నులకు పన్ను రాయితీలను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడం.. ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వంటి కారణాలతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, పదవిలో ఉన్నది కేవలం 45 రోజులే అయినప్పటికీ తదననంతరం ఏడాదికి సుమారు రూ.1.05 కోట్లు (1,15,000 పౌండ్లు) ప్రభుత్వం నుంచి జీవితాంతం భత్యంగా అందుకోనున్నారు.
బోరిస్ జాన్సన్ రాజీనామాతో నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ట్రస్ ఏడు వారాలు కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయారు. దీంతో బ్రిటన్కు అతితక్కువ కాలం పాటు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా యూకే చరిత్రలో నిలువనున్నారు. పనిచేసింది తక్కువ సమయమే అయినా పబ్లిక్ డ్యూటీ కాస్ట్ అలవెన్స్ (PDCA) పొందేందుకు అర్హత పొందారు. దీంతో లిజ్ ట్రస్ జీవితాంతం ఈ భత్యాన్ని అందుకోనున్నారు. మాజీ ప్రధానమంత్రులకు జీవితాంతం సహాయం అందించేందుకు 1991లో పీడీసీఏను ప్రవేశపెట్టారు. పదవిలో లేకున్నా ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనే ఉద్దేశంతో ఈ భత్యాన్ని అందిస్తారు. మాజీ ప్రధానిగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయ ఖర్చులు, సిబ్బంది వేతనాల కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఖర్చు చేసిన బిల్లులకు మాత్రమే ఈ భత్యం చెల్లిస్తారు.
అయితే, ప్రస్తుతం ఐదుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ భత్యాన్ని పొందేందుకు అర్హత సాధించగా.. ఆ జాబితాలో లిజ్ ట్రస్ చేరనున్నారు. అందులో మాజీ ప్రధాని జాన్ మేజర్, టోని బ్లెయిర్లు అత్యధిక భత్యాన్ని పొందుతున్నట్లు సమాచారం. గోర్డాన్ బ్రౌన్ (1,14,712 పౌండ్లు), డేవిడ్ కామెరోన్ (1,13,423 పౌండ్లు), థెరిసా మే (57,832 పౌండ్లు)లు భత్యాన్ని అందుకుంటున్నారు. అయితే, బోరిస్ జాన్సన్ ఈ భత్యాన్ని తీసుకుంటున్నారా..? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ లిజ్ ట్రస్ ఈ పథకం కింద లబ్ధిపొందితే.. ఆరుగురు మాజీ ప్రధాన మంత్రులకు ఏడాదికి 8లక్షల పౌండ్లు (రూ.7.37 కోట్లు) అవుతున్నట్లు అంచనా. వివాదాస్పద నిర్ణయాలతో పదవిని వీడుతోన్న లిజ్ ట్రస్కు ఈ భత్యాన్ని అందించవద్దని.. లేదా ఆమె స్వయంగా వదులుకోవాలనే వాదన మొదలయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్