Afghanistan: అఫ్గాన్లో ‘చైనీస్ గెస్ట్ హౌస్’ పై ఉగ్రదాడి
అఫ్గానిస్థాన్ (Afghanistan)లోని ఓ చైనీస్ హోటల్పై దాడి జరిగింది. ఈ భవనంలో బాంబు పేలుడుకు పాల్పడిన సాయుధులు కాల్పులతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.
కాబుల్: అఫ్గానిస్థాన్ (Afghanistan) రాజధాని కాబుల్ (Kabul) మరోసారి బాంబు పేలుడు (Bomb Blast), కాల్పులతో దద్దరిల్లింది. ఈ నగరంలో అత్యంత రద్దీగా ఉండే షహర్-ఇ నావ్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఉగ్రదాడి జరిగింది. ‘చైనీస్ గెస్ట్ హౌస్ (Chinese Guest House)’గా పిలిచే ఈ భవనానికి తరచూ చైనా వ్యాపారులు వస్తుంటారు. భారీ పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తర్వాత కొందరు సాయుధులు భవనంలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హోటల్లో కాల్పులు జరుగుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత రాలేదు. కాగా.. అఫ్గాన్లో చైనీయుల భద్రతపై చైనా రాయబారి వాంగ్ యు.. నిన్న అఫ్గాన్ విదేశాంగ శాఖ అధికారులను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.
అఫ్గాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడి, కాల్పుల ఘటనలు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఇస్లామిక్ స్టేట్ జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు రష్యన్ ఎంబసీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. నిన్న అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. బలూచిస్థాన్లోని చమన్ జిల్లాలోపాక్ పౌరులపై తాలిబన్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 17 మందికి గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM