Kim: సముద్రతీర విల్లాలో కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్..!
కిమ్ ఇటీవల తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆమె సముద్రతీరంలోని విల్లాలో విలాసవంతమైన జీవితం జీవిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా, ఆ దేశ నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రతి విషయమూ ఆసక్తికరమే. ఇటీవల ఆయన క్షిపణి ప్రయోగ ప్రదేశానికి తన కుమార్తెను తీసుకువచ్చి ఆశ్చర్యపరిచారు. జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న సమయంలో ఆమెను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పిల్లలకు అందుతోన్న విలాసవంతమైన జీవితం గురించి న్యూయార్క్ పోస్టు కథనం ప్రచురించింది. ఉత్తరకొరియా విశ్లేషకులు వెల్లడించి వివరాలను దీనిలో ఉటంకించింది.
కిమ్ ప్రపంచానికి పరిచయం చేసిన కుమార్తె పేరు జుయె(Ju Ae) అని తెలుస్తోంది. ఆమె కాంగ్వాన్ ప్రావిన్సులోని వాన్సాన్ సముద్ర తీరంలో ఉన్న విల్లాలో సకల సౌకర్యాల మధ్య జీవిస్తున్నట్లు వెల్లడించింది. ఈత కొలను, టెన్నిస్ కోర్టు, సాకర్ మైదానం, వాటర్స్లైడ్స్, స్పోర్ట్స్ స్టేడియం ఉన్నట్లు తెలిపింది. ‘ఆమె అందమైన జీవితం గడుపుతున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు పెద్దసంఖ్యలో సహాయక సిబ్బంది ఉన్నారు. అలాగే ఎక్కువ సమయం వారి తల్లిదండ్రులతోనూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక కిమ్ తండ్రి చాలా కఠినంగా ఉండేవారు. కానీ తన పిల్లల పట్ల మాత్రం ఎంతో శ్రద్ధ చూపేవారు’ అని మైఖెల్ మాడెన్ అనే విశ్లేషకుడు వెల్లడించారు.
కిమ్ కుటుంబానికి దేశవ్యాప్తంగా విలాస సౌధాలు 15 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సొరంగమార్గాల్లోనే వాటి మధ్య ప్రయాణిస్తారట. అందుకోసం భూగర్భంలో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కిమ్ కుటుంబ కదలికలు శత్రుదేశాల దృష్టిలో పడకుండా ఉండేందుకే ఇలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తారని ఆ కథనం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?