Malaysia: మలేసియా మాజీ ప్రధాని ముహిద్దీన్ యాసిన్ అరెస్ట్
అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో మలేసియా (Malaysia) మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ అరెస్టయ్యారు. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్ ఆరోపణలపై యాసిన్పై కేసు నమోదయ్యింది.
కౌలాలంపుర్: మలేసియా (Malaysia) మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ అరెస్టయ్యారు. అవినీతి (Corruption) ఆరోపణలపై అరెస్టు చేసిన అవినీతి నిరోధక విభాగం అధికారులు.. ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో మలేసియాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అధికారానికి దూరమైన మూడు నెలలకే యాసిన్పై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం.
ప్రధానమంత్రిగా 17 నెలలపాటు పదవిలో ఉన్న సమయంలో ముహిద్దీన్ యాసిన్ (Muhyiddin Yasin) అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంలో అవినీతి చోటుచేసుకుందన్నది ప్రధాన ఆరోపణ. గతేడాది నవంబర్లో కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim).. యాసిన్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక విభాగం ముహిద్దీన్ యాసిన్ అరెస్టు చేసింది. అయితే, వీటిని తోసిపుచ్చిన యాసిన్.. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు.
2018 నుంచి ఇప్పటివరకు మలేసియాకు నలుగురు ప్రధానమంత్రులుగా పనిచేశారు. మార్చి 2020 నుంచి ఆగస్టు 2021 వరకు ముహిద్దీన్ యాసిన్ అధికారంలో ఉన్నారు. ఓవైపు ప్రభుత్వంలో అంతర్గత పోరు, మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, ఆర్థికవ్యవస్థ క్షీణించడం వంటి సవాళ్లను ఆయన ఎదుర్కొన్నారు. సుమారు ఏడదిన్నర పాటు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చినప్పటికీ పార్లమెంటులో మాత్రం మెజారిటీ సంపాదించలేకపోయారు. దీంతో ముహిద్దీన్ యాసిన్ ఆగస్టు 2021లో రాజీనామా చేశారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో చిన్న పార్టీలతో కలిసి అన్వర్ ఇబ్రహీం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అంతకుముందు మలేసియా ప్రధానిగా కొనసాగిన నాజిబ్ రజాక్పైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్టైన నాజిబ్ రజాక్కు 12ఏళ్ల జైలు శిక్ష పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత