Monterey Park shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. అనుమానితుడి ఆత్మహత్య!
అమెరికాలో మాంటెరీ పార్క్లో కాల్పులకు పాల్పడింది ఓ వృద్ధుడిగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)లోని మాంటెరీ పార్క్(Monterey Park)లో బాల్రూమ్ డ్యాన్స్ స్టూడియోలో మారణహోమానికి పాల్పడినట్లు భావిస్తున్న వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. షాట్గన్తో తనకు తానే కాల్చుకున్నట్లు అతడి శరీరంపై గాయం ఉందని పోలీసులు చెప్పారు. అనుమానితుడు చైనా నుంచి వలస వచ్చిన హూ కాన్ ట్రాన్ (72)గా గుర్తించారు. ట్రాన్ కాల్పులకు పాల్పడిన తర్వాత కొందరు వ్యక్తులు అతడి ఆయుధాన్ని లాక్కొన్నట్లు సమాచారం. అతడు గతంలో ట్రక్కు డ్రైవర్గా పనిచేశాడు. దీంతోపాటు ‘ట్రాన్స్ ట్రక్కింగ్ ఐఎన్సీ’ పేరిట వ్యాపారం చేశాడు.
కాల్పులు జరిపిన డ్యాన్స్ స్టూడియోకు ట్రాన్ తరచూ వస్తాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అక్కడ అతడి మాజీ భార్యతో కలిసి సమయం గడిపేవాడని వారు చెప్పారు. అతడు 2006లోనే భార్య నుంచి విడాకులు తీసుకొన్నాడు. ఘటనా స్థలానికి సమీపంలోని సాన్ గాబ్రియేల్లో అతడు నివాసం ఉండేవాడు. స్టూడియోలోని శిక్షకులు, చాలా మంది వ్యక్తులతో అతడికి అంతగా పడేది కాదని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు అతడికి వేగంగా కోపం వచ్చేదని పేర్కొన్నారు. నిన్నమాజీ భార్యను వెతుక్కొంటూ ట్రాన్ డ్యాన్స్ స్టూడియోకు వచ్చినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అక్కడ ఆమెను చూడగానే విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లు వెల్లడించాయి.
లాస్ఏంజెలెస్ ప్రాంతంలోని బాల్రూం డ్యాన్స్ క్లబ్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చైనా నూతన లూనార్ సంవత్సర వేడుకల నేపథ్యంలో వేలాది మంది అక్కడ గుమిగూడారు. ఆ సమయంలో ఓ సాయుధుడు మెషీన్ గన్తో కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నగరంలో 60 వేల మంది జీవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300