Contact lense: కాంటాక్ట్ లెన్స్తో నిద్రపోతే.. కన్నునే తినేసింది!
కాంటాక్ట్ లెన్స్ను (Contact Lenses) సరిగా ఉపయోగించకపోవడంతో క్రుమ్హోల్జ్ (Krumholz) అనే వ్యక్తి పూర్తిగా కంటిచూపును కోల్పోయాడు.అతడి కంట్లో భయంకరమైన పరాన్న జీవి ఉంటున్నట్లు వైద్యులు తేల్చారు.
ఇంటర్నెట్డెస్క్: చూపు సరిగా లేనివారు సాధారణంగా కళ్లద్దాలు (spectacles) వాడుతుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో వాటి స్థానంలో కాంటాక్ట్ లెన్స్ (Contact Lenses) వాడే వారి సంఖ్య పెరిగింది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కాంటాక్ట్ లెన్స్ వాడితే కళ్లకే ప్రమాదం. పడుకునేటప్పుడు కూడా వాటిని తీయకపోవడంతో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన క్రుమ్హోల్జ్ (Krumholz) అనే 21 ఏళ్ల యువకుడు పూర్తిగా కంటి చూపునే కోల్పోయాడు.
క్రుమ్హోల్జ్ అనే యువకుడు గత 7 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అప్పుడప్పుడూ వాటిని తీయకుండానే నిద్రపోయేవాడు. కొన్ని సార్లు అతడి కళ్లు గులాబీ రంగులోకి మారడం, దురద పెట్టడం జరిగేవి. అయితే, దీనిని అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య లెన్స్ పెట్టుకున్నా కనిపించకపోవడంతో వైద్యుల్ని సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అతడి కంట్లో ప్రమాదకరమైన అకంతమొయిబా కెరటైటిస్ అనే పరాన్నజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కంటి మొత్తాన్ని తినేశాయని, ఫలితంగా అతడు పూర్తిగా చూపు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు.
దీంతో తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకుండా ఉండేందుకు అతడు అవగాహన కల్పిస్తున్నాడు. కాంటాక్ట్ లెన్స్ తీయకుండా తరచూ నిద్ర పోయినందుకు తనకు ఏం జరిగిందో Gofundme వెబ్పేజీలో అందులో రాసుకొచ్చాడు. ‘‘ కొన్ని సార్లు పడుకొని లేచిన తర్వాత కుడి కన్ను కాస్త దురదగా అనిపించేంది. గులాబీ రంగులోకి మారేది. వైద్యుల్ని సంప్రదిస్తే కంటిలో హెచ్ఎస్వీ1 అనే వైరస్ ఉన్నట్లు చెప్పారు. కానీ, దాదాపు ఐదుగురు కంటి వైద్య నిపుణులు, ఇద్దరు కార్నియా నిపుణుల్ని సంప్రదించిన తర్వాత అది వైరస్ కాదని భయంకరమైన పరాన్నజీవి అని తేలింది’’ అని క్రుమ్హోల్జ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని, ఆ పరాన్న జీవి కంటిని పూర్తిగా తినేసిందని చెప్పాడు. అందుకే కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించే వారంతా జాగ్రత్తగా ఉండాలని, నిద్రపోయినప్పుడు, స్నానం చేస్తున్న సమయంలో కచ్చితంగా వాటిని తీసేయాలని చెబుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)