South Korea: మూడుపదులు దాటినా పెళ్లికి దూరం.. రికార్డు స్థాయిలో పడిపోయిన వివాహాలు
జనాభా (Population) సంక్షోభాన్నిఎదుర్కొంటున్న దక్షిణ కొరియాలో (South Korea) వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెళ్లిళ్ల సంఖ్య (Marriages) గతేడాది రికార్డు స్థాయిలో పడిపోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
సియోల్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా (Population) భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాలు మాత్రం తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా, జపాన్లు సతమతమవుతుండగా.. దక్షిణ కొరియాకు (South Korea) సైతం ఇది పెను సవాలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ వివాహాల సంఖ్య గతేడాది రికార్డు స్థాయిలో పడిపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ప్రపంచంలోనే అతితక్కువ జననాల రేటున్న ద.కొరియాకు.. పౌరులు ఆలస్య వివాహాలు (Marriage) చేసుకోవడం/దూరంగా ఉండటం వంటివి మరింత కలవరపెడుతున్నాయి.
దక్షిణ కొరియా 1970 నుంచి దేశవ్యాప్తంగా వివాహాల నమోదును క్రమం తప్పకుండా నమోదు చేస్తోంది. గతేడాది దేశంలో 1,92,000 వివాహాలు జరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2012లో 3,27,000లతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ! దశాబ్ద కాలంతో పోలిస్తే వీటి సంఖ్య 40శాతం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా 1970 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయిలో వివాహాలు జరగడం కూడా ఇది తొలిసారి.
సరాసరి 33 ఏళ్లకు పెళ్లి..
దక్షిణ కొరియాలో యువతీ, యువకులు వివాహాలను ఆలస్యంగా చేసుకుంటున్నట్లు నివేదికలను బట్టి చూస్తే తెలుస్తోంది. అక్కడి పురుషులు తొలి వివాహ వయస్సు సరాసరి 33.7 ఏళ్లుగా నమోదైంది. అమ్మాయిలు కూడా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. మహిళల సరాసరి వివాహ వయసు 31.3గా ఉంది. గతేడాది జరిగిన లక్షా 90వేల వివాహాల్లో 80శాతం మంది మొదటిసారి పెళ్లి చేసుకున్నవాళ్లే.
భారీ ఖర్చు చేస్తున్నప్పటికీ..
కొన్ని దశాబ్దాలుగా దక్షిణ కొరియా జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం 5.2కోట్ల జనాభా ఉండగా.. 2067 నాటికి అది 3.9కోట్లకు పడిపోనున్నట్లు అంచనా. ఈ క్రమంలో జనాభా సంక్షోభాన్ని నివారించేందుకు దక్షిణకొరియా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా జననాల రేటు పెంచేందుకుగాను 2006 నుంచి సుమారు 213 బి.డాలర్లు (రూ.17లక్షల కోట్లు) ఖర్చు పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ద.కొరియాలో జీవన వ్యయంతోపాటు నివాస ఖర్చులు భారీగా పెరగడం అనేవి వివాహాలు తక్కువగా ఉండటం, జననాల రేటు క్షీణించేందుకు కారణాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలు చేసే మహిళలు తమ పిల్లల్ని చూసుకునేందుకు సరైన సమయం కేటాయించలేకపోవడమూ వారిపై ఒత్తిడికి కారణమవుతోందని చెబుతున్నారు. ఇలా భిన్న కారణాలతో అక్కడి యువతీ, యువకులు వివాహాలకు దూరంగా ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు కూడా పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?