Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్ఫోన్ పితామహుడు
ప్రపంచ జనాభాతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెల్ఫోన్ల (Mobile) సంఖ్యే అధికం. ఇలా దాదాపు ప్రతిఒక్కరి చేతిలో వాలిపోయిన సెల్ఫోన్ వాడకం తీరును చూసి దాని సృస్టికర్త మార్టిన్ కూపర్ (Martin Cooper) విస్తుపోయారు. కొందరు మూర్ఖంగా వినియోగిస్తున్నారన్న ఆయన.. మరో తరం వచ్చే సరికి మార్పు వస్తుందన్నారు.
కాలిఫోర్నియా: ఆధునిక ప్రపంచంలో కనిపెట్టిన అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో మొబైల్ ఫోన్ (Mobile) ఒకటి. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో కేవలం సంభాషణల కోసం పరిమితమైన మొబైల్ ఫోన్.. ప్రస్తుతం ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకుంది! సెల్ఫోన్ వాడకంపై చాలామందిలో నియంత్రణ లేమి, విచ్చలవిడితత్వం కనిపిస్తుంటుంది. అటువంటి సంఘటనలను చూసి ఏకంగా సెల్ఫోన్ కనిపెట్టిన ఇంజినీర్ విస్తుపోయాడట. సెల్ఫోన్ను విపరీతంగా చూస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఇంజినీర్, మొబైల్ సృష్టికర్త మార్టిన్ కూపర్ (Martin Cooper) తన మనోగతాన్ని వెల్లడించారు.
కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన సెల్ఫోన్ను అమెరికాకు చెందిన మార్టిన్ కూపర్ (Martin Cooper) ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 1973 ఏప్రిల్ 3న తొలిసారి ఆ పరికరంతో సంభాషణ జరిపారు. ఆయనను ‘సెల్ఫోన్ పితామహుడు’ అని పిలుస్తుంటారు. మొబైల్ఫోన్ను తొలిసారి ఉపయోగించిన విధానం.. ప్రస్తుతం వాడుతున్న తీరుపై 94ఏళ్ల మార్టిన్ తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఎంతో చక్కగా కనిపిస్తోన్న ఈ పరికరం.. ఏదో ఒకరోజు వ్యాధులను జయించడానికి దోహదం చేస్తుందన్నారు. కానీ, ప్రస్తుతం మనకు అది కొంత నష్టాన్ని కలిగించవచ్చని అన్నారు.
‘ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ భాగమైపోయింది. మేం ఊహించినట్లుగానే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ చేరింది. ప్రపంచ జనాభా కంటే మొబైల్ ఫోన్ల సంఖ్యే ఎక్కువ. ఇది మా కలను కొంతవరకు సాకారం చేసినట్లే. భవిష్యత్తులో విద్యా, ఆరోగ్య వ్యవస్థల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఒకటి, రెండు తరాల్లో వ్యాధులను కూడా జయించే స్థాయికి ఇవి చేరతాయి’ అని మార్టిన్ కూపర్ పేర్కొన్నారు. ఇదే అంశంపై కొంతకాలం క్రితం మాట్లాడిన ఆయన.. ఏదో ఒకరోజు అవి (Cell Phone) మన చర్మంలో కలిసిపోయే పరికరాలుగా మారిపోతాయని అన్నారు.
‘ఓ వ్యక్తి సెల్ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతున్న ఘటనను చూసి నేను విస్తుపోయా. కార్లు ఢీకొన్న తర్వాత కొంతమందికి ఆ విషయం గుర్తొస్తుంది. అది వారి మూర్ఖత్వం. ప్రస్తుతం మనం నిత్యం మొబైల్ ఫోన్లను పట్టుకు వేలాడే దశలో ఉన్నాం. ఇది ఎంతోకాలం ఉండదు. ప్రతితరం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంది. సెల్ఫోన్ను అత్యంత మెరుగ్గా ఎలా ఉపయోగించాలో వారు నేర్చుకుంటారు. మానవులు త్వరలోనే ఈ విషయాన్ని గుర్తిస్తారు. లక్షల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఉండటం కొంచెం ఎక్కువే అనిపిస్తుంటుంది. మనవళ్లు, మునిమనమలు వాడిన విధంగా నేను ఎప్పటికీ వాటిని అర్థం చేసుకోలేను’ అని ప్రజలు సెల్ఫోన్ వాడుతున్న తీరుపై మార్టిన్ కూపర్ నవ్వుతూ సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!