Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్ఫోన్ పితామహుడు
ప్రపంచ జనాభాతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెల్ఫోన్ల (Mobile) సంఖ్యే అధికం. ఇలా దాదాపు ప్రతిఒక్కరి చేతిలో వాలిపోయిన సెల్ఫోన్ వాడకం తీరును చూసి దాని సృస్టికర్త మార్టిన్ కూపర్ (Martin Cooper) విస్తుపోయారు. కొందరు మూర్ఖంగా వినియోగిస్తున్నారన్న ఆయన.. మరో తరం వచ్చే సరికి మార్పు వస్తుందన్నారు.
కాలిఫోర్నియా: ఆధునిక ప్రపంచంలో కనిపెట్టిన అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో మొబైల్ ఫోన్ (Mobile) ఒకటి. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో కేవలం సంభాషణల కోసం పరిమితమైన మొబైల్ ఫోన్.. ప్రస్తుతం ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకుంది! సెల్ఫోన్ వాడకంపై చాలామందిలో నియంత్రణ లేమి, విచ్చలవిడితత్వం కనిపిస్తుంటుంది. అటువంటి సంఘటనలను చూసి ఏకంగా సెల్ఫోన్ కనిపెట్టిన ఇంజినీర్ విస్తుపోయాడట. సెల్ఫోన్ను విపరీతంగా చూస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఇంజినీర్, మొబైల్ సృష్టికర్త మార్టిన్ కూపర్ (Martin Cooper) తన మనోగతాన్ని వెల్లడించారు.
కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన సెల్ఫోన్ను అమెరికాకు చెందిన మార్టిన్ కూపర్ (Martin Cooper) ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 1973 ఏప్రిల్ 3న తొలిసారి ఆ పరికరంతో సంభాషణ జరిపారు. ఆయనను ‘సెల్ఫోన్ పితామహుడు’ అని పిలుస్తుంటారు. మొబైల్ఫోన్ను తొలిసారి ఉపయోగించిన విధానం.. ప్రస్తుతం వాడుతున్న తీరుపై 94ఏళ్ల మార్టిన్ తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఎంతో చక్కగా కనిపిస్తోన్న ఈ పరికరం.. ఏదో ఒకరోజు వ్యాధులను జయించడానికి దోహదం చేస్తుందన్నారు. కానీ, ప్రస్తుతం మనకు అది కొంత నష్టాన్ని కలిగించవచ్చని అన్నారు.
‘ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ భాగమైపోయింది. మేం ఊహించినట్లుగానే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ చేరింది. ప్రపంచ జనాభా కంటే మొబైల్ ఫోన్ల సంఖ్యే ఎక్కువ. ఇది మా కలను కొంతవరకు సాకారం చేసినట్లే. భవిష్యత్తులో విద్యా, ఆరోగ్య వ్యవస్థల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఒకటి, రెండు తరాల్లో వ్యాధులను కూడా జయించే స్థాయికి ఇవి చేరతాయి’ అని మార్టిన్ కూపర్ పేర్కొన్నారు. ఇదే అంశంపై కొంతకాలం క్రితం మాట్లాడిన ఆయన.. ఏదో ఒకరోజు అవి (Cell Phone) మన చర్మంలో కలిసిపోయే పరికరాలుగా మారిపోతాయని అన్నారు.
‘ఓ వ్యక్తి సెల్ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతున్న ఘటనను చూసి నేను విస్తుపోయా. కార్లు ఢీకొన్న తర్వాత కొంతమందికి ఆ విషయం గుర్తొస్తుంది. అది వారి మూర్ఖత్వం. ప్రస్తుతం మనం నిత్యం మొబైల్ ఫోన్లను పట్టుకు వేలాడే దశలో ఉన్నాం. ఇది ఎంతోకాలం ఉండదు. ప్రతితరం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంది. సెల్ఫోన్ను అత్యంత మెరుగ్గా ఎలా ఉపయోగించాలో వారు నేర్చుకుంటారు. మానవులు త్వరలోనే ఈ విషయాన్ని గుర్తిస్తారు. లక్షల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఉండటం కొంచెం ఎక్కువే అనిపిస్తుంటుంది. మనవళ్లు, మునిమనమలు వాడిన విధంగా నేను ఎప్పటికీ వాటిని అర్థం చేసుకోలేను’ అని ప్రజలు సెల్ఫోన్ వాడుతున్న తీరుపై మార్టిన్ కూపర్ నవ్వుతూ సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ