Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్ఫోన్ పితామహుడు
ప్రపంచ జనాభాతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెల్ఫోన్ల (Mobile) సంఖ్యే అధికం. ఇలా దాదాపు ప్రతిఒక్కరి చేతిలో వాలిపోయిన సెల్ఫోన్ వాడకం తీరును చూసి దాని సృస్టికర్త మార్టిన్ కూపర్ (Martin Cooper) విస్తుపోయారు. కొందరు మూర్ఖంగా వినియోగిస్తున్నారన్న ఆయన.. మరో తరం వచ్చే సరికి మార్పు వస్తుందన్నారు.
కాలిఫోర్నియా: ఆధునిక ప్రపంచంలో కనిపెట్టిన అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో మొబైల్ ఫోన్ (Mobile) ఒకటి. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో కేవలం సంభాషణల కోసం పరిమితమైన మొబైల్ ఫోన్.. ప్రస్తుతం ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకుంది! సెల్ఫోన్ వాడకంపై చాలామందిలో నియంత్రణ లేమి, విచ్చలవిడితత్వం కనిపిస్తుంటుంది. అటువంటి సంఘటనలను చూసి ఏకంగా సెల్ఫోన్ కనిపెట్టిన ఇంజినీర్ విస్తుపోయాడట. సెల్ఫోన్ను విపరీతంగా చూస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఇంజినీర్, మొబైల్ సృష్టికర్త మార్టిన్ కూపర్ (Martin Cooper) తన మనోగతాన్ని వెల్లడించారు.
కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన సెల్ఫోన్ను అమెరికాకు చెందిన మార్టిన్ కూపర్ (Martin Cooper) ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 1973 ఏప్రిల్ 3న తొలిసారి ఆ పరికరంతో సంభాషణ జరిపారు. ఆయనను ‘సెల్ఫోన్ పితామహుడు’ అని పిలుస్తుంటారు. మొబైల్ఫోన్ను తొలిసారి ఉపయోగించిన విధానం.. ప్రస్తుతం వాడుతున్న తీరుపై 94ఏళ్ల మార్టిన్ తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఎంతో చక్కగా కనిపిస్తోన్న ఈ పరికరం.. ఏదో ఒకరోజు వ్యాధులను జయించడానికి దోహదం చేస్తుందన్నారు. కానీ, ప్రస్తుతం మనకు అది కొంత నష్టాన్ని కలిగించవచ్చని అన్నారు.
‘ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ భాగమైపోయింది. మేం ఊహించినట్లుగానే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ చేరింది. ప్రపంచ జనాభా కంటే మొబైల్ ఫోన్ల సంఖ్యే ఎక్కువ. ఇది మా కలను కొంతవరకు సాకారం చేసినట్లే. భవిష్యత్తులో విద్యా, ఆరోగ్య వ్యవస్థల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఒకటి, రెండు తరాల్లో వ్యాధులను కూడా జయించే స్థాయికి ఇవి చేరతాయి’ అని మార్టిన్ కూపర్ పేర్కొన్నారు. ఇదే అంశంపై కొంతకాలం క్రితం మాట్లాడిన ఆయన.. ఏదో ఒకరోజు అవి (Cell Phone) మన చర్మంలో కలిసిపోయే పరికరాలుగా మారిపోతాయని అన్నారు.
‘ఓ వ్యక్తి సెల్ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతున్న ఘటనను చూసి నేను విస్తుపోయా. కార్లు ఢీకొన్న తర్వాత కొంతమందికి ఆ విషయం గుర్తొస్తుంది. అది వారి మూర్ఖత్వం. ప్రస్తుతం మనం నిత్యం మొబైల్ ఫోన్లను పట్టుకు వేలాడే దశలో ఉన్నాం. ఇది ఎంతోకాలం ఉండదు. ప్రతితరం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంది. సెల్ఫోన్ను అత్యంత మెరుగ్గా ఎలా ఉపయోగించాలో వారు నేర్చుకుంటారు. మానవులు త్వరలోనే ఈ విషయాన్ని గుర్తిస్తారు. లక్షల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఉండటం కొంచెం ఎక్కువే అనిపిస్తుంటుంది. మనవళ్లు, మునిమనమలు వాడిన విధంగా నేను ఎప్పటికీ వాటిని అర్థం చేసుకోలేను’ అని ప్రజలు సెల్ఫోన్ వాడుతున్న తీరుపై మార్టిన్ కూపర్ నవ్వుతూ సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి. -
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..