Pakistan: ఇమ్రాన్జీ.. పాక్ వదిలి, భారత్ వెళ్లిపోండి..
‘పొరుగున ఉన్న భారత్ సార్వభౌమ దేశం. ప్రపంచంలో మరే శక్తీ ఆ దేశాన్ని శాసించలేదు’ అంటూ శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. నేడు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
ఇస్లామాబాద్: ‘పొరుగున ఉన్న భారత్ సార్వభౌమ దేశం. ప్రపంచంలో మరే శక్తీ ఆ దేశాన్ని శాసించలేదు’ అంటూ శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. నేడు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. పాక్ను వదిలి.. భారత్ వెళ్లిపోవాలని విమర్శించాయి.
‘చేతిలో నుంచి అధికారం పోతోందని ఆ వ్యక్తి పిచ్చెక్కిపోతున్నారు. మరెవరూ కాదు, సొంతపార్టీ వాళ్లే ఆయన్ను బహిష్కరించారని ఆయనకు ఎవరైనా చెప్పండి. మీకు భారత్ అంటే అంత ఇష్టమైతే అక్కడికే వెళ్లండి. పాకిస్థాన్ వీడండి’ అంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్.. ఇమ్రాన్పై మండిపడ్డారు.
జాతీయ అసెంబ్లీ వద్ద భద్రత పెంపు..
అవిశ్వాస తీర్మానం కోసం జాతీయ అసెంబ్లీ సమావేశమవుతోన్న తరుణంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే.. తర్వాత ముందుకెళ్లాల్సిన ప్రక్రియను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మిత్రపక్షాలు, సొంతపార్టీ నేతలు ఇమ్రాన్కు దూరంగా జరగడంతో అధికార పీటీఐకు మెజార్టీ సభ్యులు లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు