Harry and Markle: ప్రిన్స్ హ్యారీ దంపతులను వెంటాడిన మీడియా.. క్యాబ్ డ్రైవర్ ఏమన్నారో తెలుసా?
క్యాబ్లో ప్రయాణిస్తుండగా మీడియా ప్రతినిధులు వెంబడించడంతో ప్రిన్స్ హ్యారీ (Prince Harry) దంపతులు తీవ్ర ఇబ్బందికి గురైన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఎదురైన అనుభవాన్ని క్యాబ్ డ్రైవర్ సుక్చరణ్ సింగ్ మీడియాకు తెలిపారు.
న్యూయార్క్: బ్రిటన్ రాజు ఛార్లెస్ రెండో తనయుడు హ్యారీ(Harry), ఆయన సతీమణి మెర్కెల్ను (Meghan Markle) మీడియా ప్రతినిధులు (పాపరాజీ) కారులో వెంటాడి నరకం చూపించిన సంగతి తెలిసిందే. హ్యారీ దంపతులతోపాటు మెర్కెల్ తల్లి డోరియా రగ్లాడ్ వారి నుంచి తప్పించుకునేందుకు మన్హట్టన్ పోలీస్స్టేషన్కు వెళ్లగా.. సర్దిచెప్పిన పోలీసులు వాళ్లను తిరిగి క్యాబ్లో పంపించారు. ఆ క్యాబ్ డ్రైవర్ ఇండో అమెరికన్ సుఖ్చరణ్ సింగ్ తమకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు తెలిపారు. పోలీస్స్టేషన్ నుంచి బయల్దేరిన 10 నిమిషాల్లో మళ్లీ మీడియా ప్రతినిధులు వెంబడించినట్లు చెప్పారు. దీంతో హ్యారీ దంపతులు చాలా భయపడ్డారని వారి సూచన మేరకు తిరిగి క్యాబ్ను పోలీస్స్టేషన్కు తీసుకొచ్చేశానని అన్నారు.
‘‘ నేను 67 స్ట్రీట్లో ఉన్నాను. ఓ సెక్యూరిటీ అధికారి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రమ్మన్నారు. ఆ తర్వాత హ్యారీ దంపతులతోపాటు డోరియా రగ్లాడ్ క్యాబ్లోకి వచ్చారు. మేం ట్యాక్సీలో వెళ్తుండగా.. చెత్త తరలించే వాహనం అడ్డువచ్చింది. దీంతో అక్కడ ఆగాల్సి వచ్చింది. ఇంతలో మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా వచ్చేశారు. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో హ్యారీ దంపతులు ట్యాక్సీని తిరిగి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. మేం పోలీస్స్టేషన్కు వచ్చే వరకు వాళ్లంతా మమ్మల్ని వెంబడించారు. హ్యారీ దంపతులు చాలా మంచివారు. మీడియా ప్రతినిధుల ప్రవర్తనతో ఒకింత భయానికి గురయ్యారు. నేను వాళ్లను పోలీస్స్టేషన్ వద్ద విడిచిపెట్టి వచ్చేశాను’’ అని క్యాబ్ డ్రైవర్ సుఖ్చరణ్ సింగ్ తెలిపారు.
మంగళవారం రాత్రి ప్రిన్స్ హ్యారీ దంపతులకు ఎదురైన అనుభవం గురించి వారి అధికార ప్రతినిధి బుధవారం మీడియాకు వివరించారు. ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హ్యారీ, మెర్కెల్, ఆమె తల్లి డోరియా రగ్లాడ్లు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు వెంబడించారు. ఈ క్రమంలో ఇతర కార్లను, పాదచారులను, ఇద్దరు న్యూయార్క్ పోలీసులను ఢీకొట్టబోయారని, త్రుటిలో ప్రమాదాలు తప్పాయని హ్యారీ దంపతుల అధికార ప్రతినిధి వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన చిత్రాల్లో హ్యారీ, మెర్కెల్, రగ్లాడ్ ట్యాక్సీలో ఉన్నట్లు కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని