Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
ముంబయి ఉగ్రదాడి జ్ఞాపకాలు ఇంకా అమెరికా, భారత్ను వెంటాడుతున్నాయని శ్వేతసౌధం ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్డెస్క్: ముంబయి(Mumbai)లో 2008లో జరిగిన ఉగ్రదాడు(Mumbai terror attacks)ల్లో గాయాలను భారత్, అమెరికా ఇంకా మర్చిపోలేదని అమెరికా పేర్కొంది. విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ రోజువారీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజువారీ విలేకర్ల సమావేశంలో ఒకరు పాక్కు సాయంపై నెడ్ప్రైస్ను ప్రశ్నించారు. ‘‘2008 ఉగ్రదాడులు (Mumbai terror attacks)జరిగి 14ఏళ్లు అయింది.. దీనిలో ఆరుగురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. . ఇటీవల ఫారెన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్ మైఖేల్ మెక్కౌల్ ఇటీవల యూఎస్ఎయిడ్ నిర్వాహకురాలు సమంతా పవార్కు లేఖ రాశారు. హెల్పింగ్ హ్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (హెచ్హెచ్ఆర్డీ)కి నిధులు అందించవద్దని కోరారు. ఈ సంస్థకు లష్కరే తొయిబా సహా పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఉగ్ర గ్రూపులకు సంబంధం ఉందని పేర్కొన్నారు. ఆ లేఖ గురించి.. ఉగ్రదాడిలో మరణించిన అమెరికా పౌరుల విషయంలో మీరు ఏం చెబుతారు’’ అని విలేకరి ప్రశ్నించారు.
‘‘2008 ముంబయిలోని ఉగ్రదాడుల(Mumbai terror attacks) గాయం తాలుకా గుర్తులు భారత్, అమెరికాల్లో ఇంకా మానిపోలేదు. హోటల్పై దాడి, రక్తపాతం.. ఆ నాటి భయంకర చిత్రాలు ఇంకా గుర్తుకు వస్తుంటాయి. అందుకే అమెరికా ఆ దాడికి కారణమైన వ్యక్తులే కాదు.. వీరి వెనుక ఉగ్ర సంస్థలలను ఇప్పటికీ బాధ్యత వహించేలా ఒత్తిడి చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నాటి ఉగ్రదాడిలో మొత్తం 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. 300 మంది గాయపడ్డారు. ఈ దాడిలో మొత్తం పది మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో తొమ్మిది మందిని మట్టుపెట్టగా.. కసబ్ అనే ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొన్నారు. ఆ తర్వాత 2012లో అతడికి ఉరిశిక్షను అమలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ