Trump: ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల పునరుద్ధరణ
క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంలో ట్రంప్ సామాజిక మాధ్యమ ఖాతాలను నిషేధించిన విషయం తెలిసిందే. వాటిని తాజాగా ఒక్కొక్కటిగా ఆయా సంస్థలు పునరుద్ధరిస్తున్నాయి.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు మెటా (Meta) ప్లాట్ఫామ్స్ బుధవారం ప్రకటించింది. 2020 ఆఖర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Trump) ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న క్యాపిటల్ హిల్పై దాడికి దిగారు. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్ (Trump) చేసిన ప్రకటనలే ఈ దాడికి పురిగొల్పాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన నుంచి మరిన్ని సందేశాలు వెలువడితే పరిస్థితి మరింత దిగజారొచ్చన్న అనుమానంతో అప్పట్లో ట్రంప్ సామాజిక ఖాతాలను కంపెనీ నిషేధించింది. ఇటీవలే ట్విటర్ సైతం ఆయన ఖాతాను పునరుద్ధరించింది.
‘‘ఖాతాల నిషేధం అసాధారణ పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం. రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో ప్రజలకు తెలియాలి’’ అని మెటా అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగాధిపతి నిక్ క్లెగ్ అన్నారు. తద్వారా ఆ సమాచారం ఆధారంగా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో తానూ ఉంటానని ట్రంప్ (Trump) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
తమ కొత్త కంటెంట్ విధానం ప్రకారం.. ట్రంప్ చేసిన ఏదైనా సందేశం హానికారకమైనదని మెటా నిర్ణయించి.. అయినా, ప్రజలకు దాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉందని భావిస్తే దాన్ని ఆయన ఖాతాపై అలాగే కొనసాగిస్తామని క్లెగ్ తెలిపారు. కానీ, దాన్ని ఇతరులు షేర్ చేసేందుకు మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గళాన్ని వినిపించే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారు చెప్పే సమాచారంలో వాస్తవం లేకపోయినా మాట్లాడే అవకాశం ఉండాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, తప్పులు పునరావృతం కాకుండా స్పష్టమైన కట్టుదిట్టాలను ఏర్పాటు చేశామన్నారు.
ట్రంప్ ఖాతాను నిషేధించే నాటికి ఆయనకు ఫేస్బుక్లో 34 మిలియన్లు, ఇన్స్టాగ్రామ్లో 23 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్. ఇది ట్రంప్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాలకు కావాల్సిన నిధుల సేకరణలోనూ కీలక పాత్ర పోషించింది. తాజా మెటా నిర్ణయంపై ట్రంప్ స్పందించారు. ‘‘మీ ప్రియమైన అధ్యక్షుణ్ని నిషేధించడం ద్వారా బిలియన్ల డాలర్ల విలువను కోల్పోయిన ఫేస్బుక్ తాజాగా నా ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఒక సిట్టింగ్ అధ్యక్షుడిపై ఇలాంటి చర్యలకు మరోసారి దిగొద్దు. ఇంకెవరికీ ఇలా జరగొద్దు’’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ‘ట్రుత్ సోషల్’లో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసరం ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!