China: బ్రిటన్ పార్లమెంట్లో డ్రాగన్ ఊడలు..
చైనా మనుషులు ఏకంగా బ్రిటన్ పార్లమెంట్నే లక్ష్యంగా చేసుకొన్నారు.. అక్కడ కార్యకలాపాలను కూడా చైనాకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేసేందుకు యత్నించింది.
ఎంపీలను ప్రభావితం చేస్తోన్న సీసీపీ అనుబంధ సంస్థ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా మనుషులు ఏకంగా బ్రిటన్ పార్లమెంట్నే లక్ష్యంగా చేసుకొన్నారు. అక్కడ కార్యకలాపాలను కూడా చైనాకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ నిఘా సంస్థ ఎంఐ5 గుర్తించింది. తొలిసారి బ్రిటన్ రాజకీయాల్లో చైనా జోక్యంపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంగ్లో-చైనా జాతీయురాలు క్రిస్టీన్ చింగ్ కుయ్ లీ నడుపుతోందని పేర్కొంది. ఈ ఘటన పశ్చిమ దేశాల్లో సంచలనం సృష్టించింది. ఈ కుట్రలో చైనాకు చెందిన ‘ది యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్’ హస్తం ఉందని తేల్చింది.
ఏం జరిగింది..?
బ్రిటన్లోని క్రిస్టీన్ లీ అనే న్యాయవాది బ్రిటన్ పార్లమెంట్ సభ్యులను చైనాలోని కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని ఎంఐ5 ప్రకటించింది. ఆమె చైనాలోని ‘ది యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్’ కోసం పనిచేస్తోందని వెల్లడించింది. చైనా, హాంకాంగ్ల నుంచి ఆమెకు సొమ్ము చేరుతుండగా.. వాటిని బ్రిటన్ రాజకీయ నాయకులకు విరాళాలుగా ఇస్తోందని పేర్కొంది. ఆమె వెనుక ఉన్న వారి ఆచుకీ తెలుసుకోవడానికి ఎంఐ5 చాలా రోజులు ఓపిగ్గా పనిచేసింది. హోం సెక్రటరీ ప్రీతీ పటేల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘చైనా కమ్యూనిస్టు పార్టీ కోసం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ సభ్యులను ప్రభావితం చేయాలనుకోవడం చాలా ఆందోళనకరం. ఇప్పటి వరకు ఏ స్థాయిలో ప్రభావితం చేశారో అన్న విషయంపై దృష్టిపెట్టాం’ అని పేర్కొన్నారు. లీ చైనా అధ్యక్షుడు షీజిన్ పింగ్తో కలిసి దిగిన ఫొటో సంచలనం సృష్టిస్తోంది.
హైప్రొఫైల్ వ్యక్తులతో సంబంధాలు..
క్రిస్టీన్ లీ నుంచి నిధులు అందుకొన్న వారిలో లేబర్ పార్టీ ఎంపీ బారీ గార్డెనర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లీ నుంచి ఐదేళ్లుగా 4,20,000 పౌండ్లు అందుకొన్నట్లు తేలింది. 2015-20 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. గార్డెనర్ సంస్థలో లీ కుమారుడు డేనియల్ను సెక్రటరీగా నియమించారు.
లిబరల్ డెమొక్రటిక్ నాయకుడు సర్ ఎడ్ డావీ.. లీ నుంచి 5,000 పౌండ్లు అందుకొన్నాడు. ఆ సొమ్ము తాను నేరుగా తీసుకోకుండా స్థానిక అసోసియేషన్ ద్వారా అందుకొన్నట్లు పేర్కొన్నారు.
గతంలో థెరిస్సా మే నుంచి క్రిస్టీన్ లీ అవార్డు కూడా అందుకొన్నారు. చైనా-బ్రిటన్ సమాజాల మధ్య సంబంధాలను పెంచేందుకు లీ కృషి చేస్తున్నారని అప్పట్లో థెరిస్సామే పొగడ్తలతో ముంచెత్తారు. గురువారం క్రిస్టీన్కు ఇచ్చిన అవార్డును ఉపసంహరించుకొన్నారు.
మాజీ ప్రధాని డేవిడ్ కామరూన్, లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ టామ్ వాట్సన్, లండన్ మాజీ మేయర్ కెన్ లివింగ్స్టోన్ వంటి వారితో క్రిస్టీన్కు మంచి సంబంధాలు ఉన్నాయి.
ఈ వ్యవహారాలు మొత్తం నడిపేందుకు క్రిస్టీన్ లీ బర్మింగ్హామ్లో ఒక న్యాయసేవల సంస్థను నడుపుతోంది. చైనా దౌత్యకార్యాలయానికి న్యాయ సలహాదారుగా ఉన్నట్లు ఆమె కంపెనీ ‘క్రిస్టీన్ లీ అండ్ కో ’వెబ్సైట్లో పేర్కొంది.
యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్ ఏమిటీ..?
చైనాలో యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్ చాలా శక్తిమంతమైంది. నేరుగా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ఇది రిపోర్టు చేస్తుంది. నిఘా సమాచారం సేకరించడం, విదేశీ సంబంధాలు, విదేశాల్లోని శక్తిమంతమైన వ్యక్తులను ప్రభావితం చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. చైనా కోసం పనిచేసే మేధావులు, పౌరసంఘాలు, విదేశాల్లో నివసించే చైనీయులను ఇందుకోసం వాడుకొంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్