Miss Universe 2022: ‘విశ్వసుందరి’ పోటీలకు వేళాయే.. భారత్నుంచి ఎవరంటే..!
‘మిస్ యూనివర్స్ 2022’ పోటీలకు రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం జనవరి 15న(ఆదివారం) ఉదయం 6:30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత్ నుంచి ‘మిస్ యూనివర్స్ ఇండియా’ దివితా రాయ్ పోటీ పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ‘మిస్ యూనివర్స్’ ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ విశ్వసుందరి పోటీల(Miss Universe 2022)కు రంగం సిద్ధమైంది. జనవరి 14న అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ వేదికగా ‘మిస్ యూనివర్స్- 2022’ పోటీలు నిర్వహించనున్నారు. ఈ 71వ ‘మిస్ యూనివర్స్’ టైటిల్ను దక్కించుకునేందుకు 80కిపైగా అందగత్తెలు పోటీ పడుతున్నారు. భారత్ తరఫున ‘మిస్ యూనివర్స్ ఇండియా’ దివితా రాయ్(Divita Roy) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మిస్ యూనివర్స్ పోటీలు స్థానిక కాలమానం ప్రకారం.. జనవరి 14న సాయంత్రం 8 గంటలకు నిర్వహించనున్నారు. అంటే.. భారత కాలమానం ప్రకారం జనవరి 15న(ఆదివారం) ఉదయం 6:30 గంటలకు జరుగుతాయి. ‘మిస్ యూనివర్స్ 2012’ ఒలివియా కల్పో, హాలీవుడ్ స్టార్ జెన్నీన్ మై జెంకిన్స్ ఈ ఏడాది హోస్ట్లుగా వ్యవహరించనున్నారు. వాస్తవానికి గతేడాది డిసెంబరులో ఈ పోటీలు జరగాల్సి ఉంది. కానీ, ఫుట్బాల్ వరల్డ్ కప్ నేపథ్యంలో వాయిదా పడింది.
ఇదిలా ఉండగా.. విశ్వసుందరి- 2021 కిరీటాన్ని మన దేశానికి చెందిన పంజాబీ ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు(Harnaaz Sandhu) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఘనత మళ్లీ మన దేశానికి దక్కింది. ఇజ్రాయెల్లోని ఐలాట్ నగరం వేదికగా జరిగిన 70వ విశ్వసుందరి పోటీల్లో 79 దేశాల నుంచి అందగత్తెలు పోటీపడ్డారు. గతంలో భారత్ నుంచి సుస్మితా సేన్(1994), లారా దత్తా(2000)లు ‘మిస్ యూనివర్స్’లుగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ