Flight Accidents: గగనతలంలో పెను విషాదాలు ఇవే..
చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బోయింగ్ విమానం పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్నది
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోయింగ్ విమానం పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్నది ఇంకా స్పష్టత లేనప్పటికీ.. ప్రమాద తీవ్రతను బట్టి ఇందులో ఎవరూ బతికే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే గతంలోనూ ఇలాంటి భారీ విమాన ప్రమాదాలు సంభవించి.. పెను విషాదాల్ని నింపాయి. అవేంటి.. ఎప్పుడు జరిగాయో ఓసారి చూద్దాం..
2020 జనవరి 10:
ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణల్లో ఓ ఉక్రెయిన్ విమానం నేలకూలింది. ఉక్రెయిన్కు చెందిన బోయింగ్ 737 విమానం టెహ్రాన్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 176 మంది మృతిచెందారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడి కారణంగానే చోటుచేసుకున్న ఈ ఘటన పట్ల అప్పట్లో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
2019 మార్చి 10:
ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం ఆ దేశ రాజధాని నగరం అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 157 మంది మరణించారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాతే బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. కొన్ని దేశాల్లో వీటిపై నిషేధం కూడా విధించారు.
2018 అక్టోబరు 29:
ఇండోనేషియాలోని లయన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం జావా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది సహా 189 మంది జలసమాధి అయ్యారు. జకార్తా నుంచి సుమత్రా దీవికి బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే కుప్పకూలింది.
2018 మే 18:
క్యూబాలోని ప్రభుత్వ విమాన సంస్థకు చెందిన విమానం ఒకటి టేకాఫ్ అయిన కాసేపటికి కూలిపోయింది. ఈ ఘటనలో 110 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా. .ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్యూబా విమానయాన చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం అని చెబుతుంటారు. ఈ ప్రమాదంలోనూ కూలిపోయింది బోయింగ్ 737 విమానమే కావడం గమనార్హం.
2018 ఏప్రిల్ 11:
అల్జీరియాలో 257 మందితో ప్రయాణిస్తోన్న మిలిటరీ విమానం ఒకటి బౌఫారిక్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.
2017 జూన్ 7:
మయన్మార్కు చెందిన మిలిటరీ రవాణా విమానం ఒకటి యాంగుంగ్ వెళ్తుండగా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 122 మంది జలసమాధి అయ్యారు.
2009 జూన్ 1:
బ్రెజిల్ నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ బయల్దేరిన ఎయిర్ ఫ్రాన్స్ 447 విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 228 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదేగాక, గతేడాది భారత్లోనూ ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయాణిస్తోన్న మిలిటరీ హెలికాప్టర్ తమిళనాడులో కూలిపోయింది. ఈ ఘటనలో రావత్ దంపతులు సహా 14 మంది మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM