Motorola: చైనా చేతికి మోటోరోల వ్యాపార రహస్యాలు..!
అమెరికాకు చెందిన దిగ్గజ టెలికం సంస్థ మోటోరోలకు చెందిన కీలక సాంకేతికత, రహస్యాలు చైనా కంపెనీ తస్కరించింది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్
ఇంటర్నెట్డెస్క్: అమెరికాకు చెందిన దిగ్గజ టెలికం సంస్థ మోటోరోలకు చెందిన కీలక సాంకేతికత, రహస్యాలను చైనా కంపెనీ తస్కరించింది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఆరోపణలు చేసింది. దీనిపై చికాగోలో కేసు నమోదు చేశారు. చైనాకు చెందిన టెలికమ్యూనికేషన్ కంపెనీ హైటెర సంస్థ ఒక పథకం ప్రకారం మోటో సాంకేతిక రహస్యాలను దక్కించుకొంది. దీనికి కొందరు మోటో ఉద్యోగులను పావులుగా వాడుకొంది. గతంలో కూడా చైనా సంస్థలు అమెరికన్ టెలికం సంస్థల రహస్యాలను దోచుకొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
షెన్జన్ కేంద్రంగా పనిచేసే హైటెర సంస్థ కుట్రపూరితంగా మలేసియాలోని మోటోరోల సంస్థ ఉద్యోగులును నియమించుకొంది. మొబైల్ వినియోగించే రేడియో టెక్నాలజీకి సంబంధించిన పత్రాలను వారి ద్వారా సంపాదించింది. మోటో సంస్థ మొబైల్ ఫోన్లను వాకీ టాకీ వలే వినియోగించేందుకు ఉద్దేశించి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 2007 నుంచి 2020 వరకు దొంగిలించిన పత్రాలతో సొంతగా అటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి హైటెర సంస్థ ప్రయత్నించింది.
ఈ వ్యవహారానికి పాల్పడిన కొందరు ఉద్యోగులు చేసిన ఈమెయిల్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిల్లో టెక్నాలజీ దొంగతనం విషయం కూడా ప్రస్తావించారు. హైటెర సంస్థకు మొత్తం 10చోట్ల డెవలప్ సెంటర్స్ ఉన్నాయి. చైనా, జర్మనీ, కెనడా, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, కెనడా వంటి చోట్ల ఉన్నాయి. ఈ సంస్థ చేసిన టూవే రేడియోలను తాజాగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో భద్రతా సిబ్బంది వాడుతున్నారు.
తాజాగా చికాగోలో నమోదైన కేసులో హైటెరప సంస్థపై నేర నిరూపణ జరిగితే భారీగా అపరాధ రుసం చెల్లించాల్సి ఉంటుంది. ఆ సంస్థ దొంగిలించిన టెక్నాలజీ విలువకు మూడు రెట్ల వరకు ఈ రుసుం ఉండొచ్చు. ఇక ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. కానీ, వ్యక్తుల పేర్లు తెలియకపోవడం, నిందితులను అప్పగించేందుకు చైనా సుమఖంగా ఉండకపోవడంతో ఈ కేసు వెంటనే తేలే అవకాశం లేదు.
మోటో సంస్థ రహస్యాలను దొంగిలించిన కేసులో హంజువాన్ జిన్ అనే మహిళా సాఫ్ట్వేర్ డెవలపర్కు నాలుగేళ్లు జైలు శిక్షపడింది. తాజా కేసులో జిన్ పేరును ప్రస్తావించలేదు. 2007లో జిన్ రెండు కంపెనీల్లో ఒకేసారి పనిచేసింది. మోటో సంస్థలో ఓ నమ్మకమైన ఉద్యోగి వలే వ్యవహరిస్తూ కీలక ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకొంది. అప్పటికే ఆమె చైనా సంస్థ సున్ కైసెన్స్లో కూడా పనిచేస్తోంది. దాదాపు 1000 కీలక పత్రాలను సంపాదించినా ఆమె చైనా పారిపోయేందుకు చికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంది. అక్కడ సాధారణ తనిఖీల్లో ఆమె వద్ద ఉన్న ఫైల్స్ బయటపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్