Ukraine crisis: కదనరంగంలో వీర నారి.. ఉక్రెయిన్ సేనలకు అండగా ‘చార్కోల్’
రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికే హీరోగా నిలిచిన ‘లేడీ డెత్’ స్థానాన్ని నేడు భర్తీ చేస్తోంది ‘చార్కోల్’. రష్యా సేనలకు ధీటుగా ఎదుర్కొంటూ.......
కీవ్: రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికే హీరోగా నిలిచింది ‘లేడీ డెత్’. కాగా నేడు ఆమె స్థానాన్ని భర్తీ చేస్తోంది ‘చార్కోల్’. రష్యా సేనలకు ధీటుగా ఎదుర్కొంటూ.. వీరోచితంగా పోరాడుతున్న యోధురాలు చార్కోల్. ముఖం సగభాగం కవర్ చేసి ఉన్న ఈ లేడీ స్నైపర్కు సంబంధించిన ఫొటోలను ఉక్రెయిన్ సైన్యం తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె పేరును వెల్లడించకుండా ‘చార్కోల్’గా అభివర్ణిస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన ‘లేడీ డెత్’తో పోల్చింది.
ఉక్రెయిన్ సైన్యం వెల్లడించిన సమాచారం ప్రకారం.. తన సోదరుడి కోరిక మేరకు 2017లో మెరైన్ సైన్యంలో చేరారు చార్కోల్. రష్యా మద్దతుతో సాగే వేర్పాటువాదులకు వ్యతిరేకంగా.. దేశం తూర్పు ప్రాంతంలో విశేష సేవలందించారు. అనేకమంది శత్రువులను మట్టుబెట్టారు. ఈ ఏడాది జనవరి నాటికి ఒప్పందం ముగియడంతో విధుల నుంచి తప్పుకొన్నారు. అయితే సైనిక చర్య పేరుతో ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడులను ప్రారంభించడంతో వెంటనే తిరిగి విధుల్లో చేరిన ఈ స్నైపర్ శత్రు సైన్యంపై వీరోచితంగా పోరాడుతున్నారు. రష్యన్ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారు రాక్షసులు అని, వారందరినీ మట్టుబెట్టడమే తన కర్తవ్యంగా పేర్కొన్నట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ వార్తాసంస్థ తెలిపింది.
గతంలో సోవియట్ రెడ్ ఆర్మీ తరఫున పోరాడి శత్రు సైన్యానికి సింహ స్వప్నంలా నిలిచిన స్నైపర్ లేడీ డెత్తో చార్కోల్ను పోల్చడం విశేషం. లేడీ డెత్ అసలు పేరు లియుడ్మిలా పావ్లిచెంకో. రెండో ప్రపంచ యుద్ధంలో ఆమె 300 మందికి పైగా జర్మన్ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఒడెసా, సెవాస్టోపోల్ను నాజీల బారినుంచి కాపాడే పోరాటంలో గాయపడింది. ఆ తర్వాత యుద్ధంలో అమెరికాకు కూడా మద్దతుగా నిలిచింది. లేడీ డెత్ సేవలకు గానూ యూఎస్ఎస్ఆర్ అత్యున్నత పురస్కారం ‘ది హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అవార్డ్’తో సత్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తోన్న రష్యా.. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. -
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారని, దేశ స్వతంత్రతను విదేశీ చేతుల్లో పెట్టారని ముయిజ్జు ఆరోపించారు. -
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు