Musk: ఖర్చు తగ్గింపులో మస్క్ విపరీతాలు..సిబ్బందికి ఇక్కట్లు..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీసుకునే నిర్ణయం ఏదైనా కాస్త కొత్తగానే ఉంటుంది. అయితే ట్విటర్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి.
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ట్విటర్ను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిర్వహణ ఖర్చు తగ్గింపు కోసం తీసుకునే చర్యలు విపరీతంగా ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం బట్టి తెలుస్తోంది. ట్విటర్కు చెందిన శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయంలో నిర్వహణ సిబ్బందిని తొలగించినట్లు, దాంతో కనీస సదుపాయాలు అందక ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించింది. చివరకు టాయిలెట్ పేపర్ను కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలిపింది.
జీతాలు పెంచమని కోరుతూ నిర్వహణ సిబ్బంది సమ్మెకు వెళ్లడంతో వారిని సంస్థ నుంచి తొలగించారు. ఆకస్మాత్తుగా వారంతా వెళ్లిపోవడంతో వాష్రూమ్లు, ఆఫీస్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఆ కథనం పేర్కొంది. సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు సొంతంగా టాయిలెట్ పేపర్ తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపింది. మరోపక్క ట్విటర్ భవనంలోని రెండు అంతస్తుల్లోనే విధులు నిర్వర్తించాలని మస్క్ చెప్పినట్లు, మిగిలిన నాలుగు అంతస్తులను మూసివేసినట్లు తెలుస్తోంది. అలాగే కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని డేటా సెంటర్ను మూసివేయాలని మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఇది సైట్ పనితీరును దెబ్బతీస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఖర్చులు తగ్గించుకోవడానికే ఆయన మొగ్గు చూపారు.
సియాటిల్లోని భవనానికి అద్దె చెల్లించడం నిలిపివేయడంతో ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది. న్యూయార్క్ నగరం, శాన్ఫ్రాన్సిస్కోలో మాత్రమే కార్యాలయాలు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మస్క్ వ్యవహార శైలితో కొందరు ఉద్యోగులు తాము పరాయి వారం అనే భావనలో ఉన్నారట. సంస్థ కార్యకలాపాల గురించి బయటకు లీక్ చేసేవారి గురించి తెలియజేయాలని తన కింది ఉద్యోగులకు మస్క్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై చేసే ఖర్చు కాకుండా ఇతర(నాన్ లేబర్) ఖర్చులను ట్విటర్ బడ్జెట్ నుంచి 500 మిలియన్ల డాలర్లు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే