Artemis 1: ముచ్చటగా మూడోసారి.. ‘ఆర్టెమిస్ 1’ ప్రయోగానికి మళ్లీ ముహూర్తం..!
చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగంగా నాసా తలపెట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగం ఇప్పటికే రెండు సార్లు చివరి నిమిషంలో వాయిదా పడింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్టెమిస్-1’ (Artemis 1) ప్రయోగానికి ముచ్చటగా మూడోసారి షెడ్యూల్ ఖరారైంది. అమెరికా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా NASA) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మూడో ప్రయత్నంగా నవంబరు 14న ఈ రాకెట్ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది.
ఇటీవల ఫ్లోరిడాలో హరికేన్ సంభవించడంతో ఈ రాకెట్ను లాంఛ్ప్యాడ్ నుంచి హాంగర్కు తరలించారు. అక్కడ ఇంజినీర్లు తనిఖీలు పూర్తయిన అనంతరం ఈ కొత్త తేదీని ఖరారు చేసినట్లు నాసా ఓ బ్లాగ్లో వెల్లడించింది. ‘‘గతవారం జరిపిన పరిశీలనలు, తనిఖీల అనంతరం రాకెట్, వ్యోమన్యౌకను లాంఛ్ప్యాడ్కు తరలించేందుకు ఇంకొంత పనే మిగిలి ఉందని ఇంజినీర్లు ధ్రువీకరించారు’’ అని నాసా తెలిపింది. నవంబరు 4 నాటికి రాకెట్ను తిరిగి లాంఛ్ ప్యాడ్ వద్దకు తీసుకురానున్నారు. నవంబరు 14న 69 నిమిషాల లాంఛ్ విండోలో నాసా ఈ ప్రయోగం చేపట్టనుంది. ఒకవేళ ఆ రోజున కుదరని పక్షంలో బ్యాకప్ తేదీని కూడా సిద్ధం చేసుకున్నారు. నవంబరు 16 లేదా 19న మరో లాంఛ్ విండోలో ప్రయోగం చేపట్టేందుకు అవకాశాలున్నాయని నాసా తెలిపింది.
చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగమే ఆర్టెమిస్-1. నాసా చేపడుతోన్న ఈ యాత్రలో శక్తిమంతమైన రాకెట్తోసహా వ్యోమనౌకలను నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. చివరి గంటలో ఇంధన లీకేజీలో సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత సెప్టెంబరు 3న మరోసారి షెడ్యూల్ చేయగా.. అప్పుడు కూడా ఇంధన లీకేజీ సమస్య వచ్చింది. దీంతో వాహకనౌకకు ఇంజనీర్లు మరమ్మతులు చేస్తున్నారు. తొలుత లాంఛ్ప్యాడ్పైనే ఉంచి మరమ్మతులు చేయగా.. ఇటీవల హరికేన్ కారణంగా హ్యాంగర్ వద్దకు తీసుకొచ్చారు.
చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. అయితే, ప్రస్తుతం మాత్రం అందులో ఉన్న ఓరియన్ క్యాప్సూల్ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది. 2024లో ఆర్టెమిస్-2, 2025లో ఆర్టెమిస్-3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్