Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
భూకంపం (Earthquake) ధాటికి వణికిపోయిన తుర్కియేను ఆదుకునేందుకు ‘ఆపరేషన్ దోస్త్’ (Operation Dost) పేరుతో భారత ప్రభుత్వం సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నం కాగా.. తాజాగా వైద్య పరికరాలు, ఔషధాలు పంపిస్తున్నట్లు తెలిపింది.
దిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే (Turkey), సిరియా దేశాలకు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ దోస్త్ (Operation Dost) పేరుతో సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి ఆస్పత్రులు, ఔషధాలు, సహాయక బృందాలు పంపిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని.. మరిన్ని బృందాలనూ పంపిస్తున్నట్లు తెలిపింది.
‘భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారుతుండటం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ, అన్ని దేశాలతో స్థిరమైన సంబంధాలు కొనసాగిస్తున్నాం. ‘వసుదైక కుటుంబం’ అనే విధానాన్ని అనుసరించే భారత్.. మానవతా సాయానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. భారత్తో విభేదాలున్నప్పటికీ తుర్కియేకి సహాయం చేయడంపై ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. ఇదివరకు బయలుదేరిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. భూకంప ప్రభావిత ప్రాంతమైన గజియన్తేప్లో ఇప్పటికే సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టాయని చెప్పారు.
‘విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న తుర్కియేకు 101 సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ తొలి బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది. అనంతరం క్షేత్ర స్థాయి ఆస్పత్రులను నెలకొల్పేందుకు కావాల్సిన పరికరాలు, ఔషధాలు, ఇతర పరికరాలతో భారత వాయుసేన విమానం సీ17 తుర్కియేకు బయలుదేరింది. మానవతా సహాయం చేసేందుకు భారత్ నుంచి వెళ్లిన నాలుగో విమానం ఇది. ఇందులో భారత సైన్యానికి చెందిన 54 మంది వైద్యుల బృందంతోపాటు ఇతర వైద్య పరికరాలు ఉన్నాయి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చీ పేర్కొన్నారు.
సమయం మించిపోతోంది..
గత కొన్ని దశాబ్దాల్లో చవిచూడని విపత్తును తుర్కియే, సిరియాలు ఎదుర్కొంటున్నాయి. తీవ్ర భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే 11వేలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించగా.. ఇంకా వేల మంది ఆ శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిని రక్షించేందుకు ‘సమయం మించిపోతోందని’ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
భారత్ నిజమైన దోస్త్
ఆపద సమయంలో సహాయం అందిస్తోన్న భారత్.. తమ ‘దోస్త్’ అంటూ తుర్కియే రాయబారి ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ దోస్త్’ అనే పేరుతో భారత్ కూడా తుర్కియే, సిరియా దేశాలకు సహాయం చేస్తోంది. భారత్తో పాటు అమెరికా, చైనా, గల్ఫ్ దేశాలు కూడా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. అవసరమైన సిబ్బందిని ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసరం ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!