Corona: రెండేళ్లు దాటినా.. కరోనా బాధితుల్లో ఆ లక్షణాలు..!
కరోనా మహమ్మారి రోజుల్లోనే నయమవుతున్నా.. కొంత మందిని మాత్రం దీర్ఘకాల కొవిడ్ వేధిస్తోంది. దీనివల్ల వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇంటర్నెట్డెస్క్: కరోనా మహమ్మారి రోజుల్లోనే నయమవుతున్నా.. కొంత మందిని మాత్రం దీర్ఘకాల కొవిడ్ వేధిస్తోంది. దీనివల్ల వారు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన బాధితుల్లో దాదాపు సగం మందిలో రెండేళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయట. ఈ మేరకు లాన్సెంట్ అధ్యయనం వెల్లడించింది.
రెండేళ్ల క్రితం కరోనా వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ఈ వైరస్ కారణంగా చాలా మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అయితే, వారిలో దాదాపు సగం మందికి కోలుకొన్న తర్వాత కూడా ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కొవిడ్ 19 మన ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపిస్తోందని స్పష్టమవుతోంది.
‘‘వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా కొవిడ్ బాధితులు శారీరకంగా, మానసికంగా కోలుకున్నారు. ఈ రెండేళ్లలో చాలా మంది తిరిగి తమ విధుల్లో చేరిపోయారు. అయితే, కొందరిలో మాత్రం కొవిడ్ లక్షణాల పర్యవసాలను ఇంకా భారంగానే ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొవిడ్ బాధితులు కాస్త తక్కువగా ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో చాలా మంది రెండేళ్లు దాటినా కూడా అలసట, కండరాల నొప్పి, నిద్రలేమి, శ్వాస సంబంధ సమస్యలు.. ఇలా ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు’’ అని లాన్సెంట్ అధ్యయనం వెల్లడించింది.
లాంగ్ కొవిడ్ వ్యాధికారతను తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని, దీర్ఘకాల కరోనా ముప్పును తగ్గించేందుకు సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాలని లాన్సెంట్ అభిప్రాయపడింది. లేదంటే ఇది ప్రజా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.