Nepal Plane Crash: తండ్రి వద్దన్నా విధులకు వెళ్లింది.. అంతలోనే..
Nepal Plane Crash: తన కూతురితో కలిసి ఇంట్లో పండగ చేసుకుందామని అనుకున్నాడు ఆ తండ్రి. అంతలోనే ఆ కుటుంబం విషాద వార్త వినాల్సి వచ్చింది.
కాఠ్మాండూ: ‘ఈరోజు పనికి వెళ్లొద్దు. ఇంట్లో అందరం కలిసి పండగ చేసుకుందాం’.. అని కుమార్తెను కోరాడు ఆ తండ్రి. అందుకు నిరాకరించిన యువతి.. ‘ఇలా వెళ్లి అలా వస్తాను. తర్వాత అంతా కలిసి పండగ చేసుకుందాం’అంటూ విధులకు వెళ్లింది. అయితే ఆమె రాకకోసం ఎదురుచూస్తూ, పండగ ఏర్పాట్లలో మునిగిపోయిన ఆ కుటుంబం ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. రెండురోజుల క్రితం నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
నేపాల్(Nepal)లో ఆదివారం 72 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తున్న 24 ఏళ్ల ఓషిన్ అలె మగర్ ఉన్నారు.
‘ఈ రోజు మాఘే సంక్రాంతి. విధులకు వెళ్లొద్దు.. ఇంట్లోనే అందరం కలిసి పండగ చేసుకుందామని ఉదయమే నా కుమార్తెకు చెప్పాను. అయితే ఆమె వినలేదు. రెండు విమాన సర్వీసుల్లో విధులు పూర్తి చేసుకొని వస్తానని పట్టుబట్టింది. ఇంతలోనే మరణ వార్త వినాల్సి వచ్చింది’ అని ఓషిన్ తండ్రి మోహన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు.
భారత్లో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న ఓషిన్.. యతి ఎయిర్లైన్స్లో రెండేళ్లుగా పనిచేస్తోంది. కాట్మాండూలో కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అక్కడి సహారా ఎయిర్ హోస్టెస్ అకాడమీలో కోర్సు పూర్తి చేసింది. ఆమెకు రెండేళ్ల క్రితమే పెళ్లైంది. ఆమె భర్త ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఈ విషాదకర వార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు పోఖారాలోని ఘటనాస్థలికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇలా ఎన్నో విషాద గాథలు వెలుగులోకి వస్తున్నాయి.
నేపాల్లోని పోఖారా నగరంలో ఆదివారం నేలకూలిన యతి ఎయిర్లైన్స్కు చెందిన విమానం బ్లాక్ బాక్స్ సోమవారం లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఇది దొరికింది. ఈ విమానంలో గల 72 మందిలో 69 మంది భౌతికకాయాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.