Monkeypox: మంకీపాక్స్కు త్వరలోనే కొత్తపేరు.. కారణమిదే..!
మంకీపాక్స్ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో.. మంకీపాక్స్ అనే పేరుతో పిలవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారితో (Covid) వణికిపోతున్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్ (Monkeypox) వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే 37 దేశాలకు వ్యాపించడంతోపాటు 2,600 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఇలా ఈ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో మంకీపాక్స్ అనే పేరుతో పిలవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒక ప్రాంతంపై వివక్షత (Discrimination) చూపించేలా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్కు కొత్త పేరును (New Name) నిర్ణయించే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిమగ్నమయ్యింది. మంకీపాక్స్ ప్రాబల్యం, పొంచివున్న ముప్పుతోపాటు పేరు మార్పుపై చర్చించేందుకు అంతర్జాతీయ నిపుణులు, భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యేందుకు సిద్ధమైంది.
అప్పట్లో ఆఫ్రికా.. ఇప్పుడు యూరప్
మంకీపాక్స్ వైరస్ను 1950ల్లో తొలుత కోతుల్లో గుర్తించారు. అనంతరం 1970లో కాంగో (డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో)లో ఓ తొమ్మిది నెలల బాలుడిలో కనుగొన్నారు. మానవుల్లో గుర్తించిన తొలి మంకీపాక్స్ కేసు కూడా అదే. అప్పటినుంచి 11 ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ప్రాబల్యం అధికంగా కొనసాగింది. అంతేకాకుండా ఏటా ఆఫ్రికాతోపాటు పశ్చిమ దేశాల్లోనూ ఎక్కడో ఒకచోట స్థానికంగా వెలుగు చూస్తూనే ఉంది. కానీ, ఈ ఏడాది మాత్రం.. ఇప్పటికే 37 దేశాలకు విస్తరించగా సుమారు మూడు వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 84 శాతం యూరప్లో, 12 శాతం అమెరికాలో ఉండగా కేవలం మూడు శాతం మాత్రమే ఆఫ్రికాలో నమోదయ్యాయి. ఇలా విస్తృత వేగంతో వ్యాపించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ పేరుతో పిలవొద్దు..
ఇలా ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ విస్తరిస్తున్న వేళ.. దీని పేరుపై శాస్త్రవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐరోపా, అమెరికా దేశాల్లో ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పశ్చిమ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికన్, కాంగో ప్రాంతానికి చెందినట్లు పిలవడాన్ని శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. అంతేకాకుండా ఈమధ్య యూరప్లో కేసులు విస్తృతంగా బయటపడుతున్నప్పటికీ గతంలో ఆఫ్రికన్ రోగుల ఫొటోలను మాత్రమే విడుదల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆఫ్రికాకు చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇటీవల లేఖ రాసింది. ఈ వైరస్ ఒక ప్రాంతానికి చెందినదిగా పేర్కొనడం సమంజసం కాదని.. వివక్షత లేని పేరును సూచించాలని అందులో పేర్కొంది. కొవిడ్-19తో పాటు అంతకుముందు విలయం సృష్టించిన ప్రాణాంతక వైరస్లను ప్రాంతాలకు అతీతంగా పేర్లను మార్పుచేయడాన్ని శాస్త్రవేత్తల బృందం గుర్తుచేసింది. ఇందుకు స్పందించిన డబ్ల్యూహెచ్ఓ పేరు మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
ఏమిటీ వైరస్..?
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
తప్పుడు మార్గంలో బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు యత్నించిన ఓ మహిళ ఏకంగా చనిపోయిన తన బంధువును బ్యాంకుకు తీసుకొచ్చింది. -
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
కెనడా (Canada) ఎయిర్పోర్టులో మాయమైన బంగారం కంటెయినర్ కేసులో ముందడుగు పడింది. ఆ కేసులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
ఆ దేశంలోని ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని (work from home) తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. -
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి