Covid Wave: మరో వేవ్కు ఈ కొత్త వేరియంట్లే కారణమవుతాయా..?
ఇటీవల బయటపడిన ఒమిక్రాన్ ఉపరకాలు మరో కొత్తవేవ్కు కారణమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒమిక్రాన్ ఉపరకాలపై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అంచనా
జోహన్నస్బర్గ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ అదుపులోనే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి. భవిష్యత్తులోనే ఇటువంటి కొత్తరకాలే మరిన్ని వేవ్లకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుపటి ఇన్ఫెక్షన్ నుంచి పొందిన యాంటీబాడీల స్థాయిలను ఇటీవల బయటపడిన ఒమిక్రాన్ ఉపరకాలు గణనీయంగా తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా మరో కొత్తవేవ్కు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో వైరస్ వ్యాప్తి పెరుగుదలకు ఒమిక్రాన్ ఉపరకాలే కారణమని.. తాజాగా అక్కడ ఐదోవేవ్కు ఇవే దారితీస్తున్నాయని అంచనా వేశారు.
ఒమిక్రాన్ నుంచి ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 ఉపరకాల ప్రాబల్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఆయా దేశాల శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఒమిక్రాన్ సోకిన బాధితులతోపాటు వ్యాక్సిన్ తీసుకున్న 39 మంది రక్తనమూనాలను పరీక్షించారు. వీటిని ఒరిజినల్ ఒమిక్రాన్ (బీఏ.1)తో పోల్చి చూశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ను నిరోధించే సామర్థ్యం ఐదురెట్లు అధికంగా ఉండగా, వ్యాక్సిన్ తీసుకోని వారిలో యాంటీబాడీల నుంచి రక్షణ ఎనిమిదిరెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తద్వారా వారిలో కొత్త వేరియంట్లబారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
గతకొన్ని రోజులుగా దక్షిణాఫ్రికాలో కరోనా ఉద్ధృతి మరోసారి పెరగడంతో ఊహించిన దానికంటే ముందే మరోవేవ్ వస్తున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఒమిక్రాన్ ఉపరకాలైన బీఏ.4, బీఏ.5లు మరోవేవ్కు దారితీస్తున్నాయనే నిర్ధారణకు వచ్చారు. ఇదిలాఉంటే, 6కోట్ల జనాభా కలిగిన దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు కేవలం 30శాతం మందికి మాత్రమే పూర్తిమోతాదులో వ్యాక్సిన్ అందింది. దీంతో అక్కడ వైరస్ ఉద్ధృతికి మరింత అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ వృద్ధి చెందే ప్రమాదం తక్కువేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ