Covid Vaccine: కరోనాపై మొక్కల ఆధారిత అడ్జువెంట్ టీకాలు సమర్థవంతమే..!
కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో మొక్కల ఆధారంగా రూపొందించిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
కొత్త వ్యాక్సిన్ రూపొందించిన కెనడా శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో మొక్కల ఆధారంగా రూపొందించిన అడ్జువెంట్ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా పలు వేరియంట్లను నిరోధించడంలో దాదాపు 70శాతం ప్రభావశీలత చూపించినట్లు తేలింది. మొక్కల ఆధారంగా నూతనంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను మనుషులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తాజా అధ్యయనం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (NEJM)లో ప్రచురితమైంది.
మొక్కల్లో ఉత్పత్తి అయ్యే కరోనా వైరస్ వంటి కణాల (CoVLP)సహాయంతో కెనడియన్ బయోటెక్నాలజీ కంపెనీ మెడికాగోకు చెందిన పరిశోధకులు ఓ టీకా రూపొందించారు. వ్యాక్సిన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు వాటికి సహాయ ఔషధం (ASO3)ని కలిపారు. ఇలా రూపొందించిన వ్యాక్సిన్ (CoVLP+ASO3) తుది దశ ప్రయోగాలను 85 కేంద్రాల్లో 24,141 మంది వాలంటీర్లపై నిర్వహించారు. అనంతరం పరిశీలించగా వారిలో 165 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. తద్వారా కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ 69.5శాతం ప్రభావశీలత చూపించిందనే నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ఓ మోస్తారు నుంచి తీవ్ర వ్యాధిని నిరోధించడంలో మాత్రం 78శాతం సమర్థత చూపినట్లు గుర్తించారు.
అయితే, పరిమిత సంఖ్యలో వాలంటీర్లను నమోదు చేసుకున్నందున 65 ఏళ్ల వయసు పైబడిన వారిపై ఈ టీకా సామర్థ్యాన్ని అంచనా వేయలేదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయినప్పటికీ యువకులు, వృద్ధుల్లో వ్యాక్సిన్ ప్రతిస్పందన ఒకే విధంగా ఉందని మునుపటి ప్రయోగ ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు. ఏదేమైనా వివిధ రకాల వేరియంట్లను ఎదుర్కోవడంలో మొక్కల ఆధారిత వ్యాక్సిన్ ‘CoVLP+ASO3’ సమర్థంగా పనిచేస్తున్నట్లు కెనడా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్