china: చైనా అధ్యక్షుడిగా మూడోసారి షీజిన్పింగ్.. కొత్త ప్రీమియర్గా లీ కియాంగ్..!
చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ విధేయుడిగా పేరున్న లీ కియాంగ్ దేశ ప్రధాని పదవి దక్కింది. ఇప్పటికే ఆ స్థానంలో ఉన్న లీ కెకియాంగ్ (67) రెండుసార్లు పదవి కాలం పూర్తికావడంతో ఆయనకు ఉద్వాసన పలికారు. ఇక జిన్పింగ్ మూడో పర్యాయ అధ్యక్షుడిగా ప్రకటించుకొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: చైనా అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీగా షీ జిన్పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని నేటి మీడియా సమావేశంలో ఆయనే స్వయంగా ప్రకటించుకొన్నారు. ఇక సరికొత్త ప్రీమియర్ (ప్రధాని)ను ఎన్నుకొన్నారు. షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్ను ఈ పదవిలోకి ఎంపిక చేశారు. షీ జిన్పింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కియాంగ్ పేరును ప్రకటించారు. దీంతోపాటు పార్టీ పొలిట్బ్యూరో.. స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యల పేర్లను కూడా వెల్లడించారు. ఈ కమిటీలో షీ జిన్పింగ్, లీ కియాంగ్తోపాటు ఝావో లిజి, వాంగ్ హునింగ్, కాయి కి, డింగ్ షూషాంగ్, లీషీకు స్థానం కల్పించారు.
ఈ మీడియా సమావేశంలో షీ జిన్పింగ్ మాట్లాడుతూ నిన్న పార్టీ కాంగ్రెస్ సమావేశాలను విజయవంతంగా ముగించామన్నారు. పార్టీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఉంచామని.. పార్టీని భవిష్యత్తులో మరింత సమష్టిగా నడపడానికి బలాలను సమ్మిళితం చేశామని వివరించారు. అంతర్జాతీయ సమాజం తమ పార్టీ కాంగ్రెస్ సమావేశాలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. వివిధ దేశాల అధిపతులు అభినందిస్తూ సందేశాలు పంపుతున్నట్లు షీ జిన్పింగ్ వెల్లడించారు. వారికి తన ధన్యవాదాలను తెలిపారు. తమ బృందంపై నమ్మకం ఉంచినందుకు పార్టీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. చైనాను అన్నిరకాలుగా ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తామన్నారు.
ఎవరీ లీ కియాంగ్..?
63 ఏళ్ల లీ కియాంగ్ సీసీపీ షాంఘై విభాగం కార్యదర్శి. షీ జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన ఈ ఏడాది షాంఘైలో అత్యంత కఠినమైన లాక్డౌన్ విధించారు. గతంలో ఝిజియాంగ్ ప్రావిన్స్లో షీ జిన్పింగ్తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జిన్పింగ్ తర్వాత స్థానంలోకి కియాంగ్ చేరుకొన్నారు.
కొన్నేళ్లుగా అత్యున్నత స్థాయి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న నలుగురు కీలక నేతలు తిరిగి ఎన్నికయ్యే అవకాశాన్ని కోల్పోయారు. వీరిలో ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (67), నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఛైర్మన్ లీ ఝాన్సు(72), చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ వాంగ్ యాంగ్(67), ఉప ప్రధాని హాన్జెంగ్ (68) ఉన్నారు. కేంద్ర కమిటీకి ఎన్నుకోకపోవడంతో వీరికి పొలిట్బ్యూరోలో, స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కదు. ప్రస్తుత ప్రభుత్వ హోదాల నుంచీ తప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పటి వరకూ దేశ పాలనా వ్యవహారాల్లో కీలకమైన సీనియర్లలో అత్యధికులను జిన్పింగ్ పథకం ప్రకారం పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు