Flight Passengers: బ్యాగేజ్తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్లైన్స్ సంస్థ!
న్యూజిలాండ్ (New Zealand)కు చెందిన ఓ విమానయాన సంస్థ లగేజ్తోపాటు ప్రయాణికుల శరీర బరువును సైతం లెక్కించనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్ వెయిట్ సర్వే (Passenger Weight Survey) పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక సర్వే ద్వారా ప్రయాణికుల శరీర బరువును లెక్కించనున్నట్లు తెలిపింది.
వెల్లింగ్టన్: విమాన ప్రయాణాల్లో ప్యాసింజర్ల(Flight Passengers) బ్యాగేజ్ బరువుపై పరిమితులు ఉంటాయి. ఈ నిబంధనల్లో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు (Flight Services) మధ్య వ్యత్యాసం ఉంటుంది. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇచ్చే సమయంలో చెక్-ఇన్ కౌంటర్ వద్ద బ్యాగేజ్ బరువు ఎంత ఉందనేది చెక్ చేస్తారు. అయితే, ఓ విమానయాన సంస్థ బ్యాగేజ్ బరువుతోపాటు ఇకపై ప్రయాణికుల శరీర బరువును కూడా లెక్కించనున్నట్లు తెలిపింది.
న్యూజిలాండ్ (New Zealand)కు చెందిన ఎయిర్ న్యూజిలాండ్ (Air New Zealand) అనే విమానయాన సంస్థ జూన్ 2 నుంచి ప్రయాణికుల లగేజ్తోపాటు వారి శరీర బరువును సైతం లెక్కించనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్ వెయిట్ సర్వే (Passenger Weight Survey) పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక సర్వే ద్వారా ప్రయాణికుల శరీర బరువును లెక్కించనున్నట్లు తెలిపింది. దీనివల్ల విమానం గాల్లోకి లేవడానికి ముందే పైలట్కు ప్రయాణికుల సగటు బరువు ఎంతనేది తెలుస్తుందని పేర్కొంది. ఇందుకోసం ఆక్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Auckland International Airport)లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
‘‘ మేం విమానంలోకి వెళ్లే ప్రతి వస్తువు బరువునూ లెక్కిస్తాం. ప్రయాణికులకు అందించే ఆహారం, ప్రయాణికులు, విమాన సిబ్బంది లగేజీని కూడా. ఇకపై ప్రయాణికుల బరువును సైతం లెక్కించాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపట్టాం. ప్రయాణికుల అనుమతి లేకుండా వారి శరీర బరువును కొలవం. ఇది పూర్తిగా స్వచ్ఛందమే. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. బరువు కొలిచే యంత్రం మీద నిలబడటం కొంత మందికి ఇబ్బందికరంగానే ఉంటుంది. మేం ప్రయాణికులకు హామీ ఇస్తున్నాం. వారి బరువును విమానాశ్రయ సిబ్బంది ఎవరు చూడలేరు. కేవలం పైలట్కు మాత్రమే విమానంలో మొత్తం ప్రయాణికుల శరీర బరువు ఎంతనేది తెలుస్తుంది’’ అని ఎయిర్ న్యూజిలాండ్ సంస్థ తెలిపింది. గతంలో కూడా ఈ సంస్థ దేశీయ విమానయాన ప్రయాణికులు బరువును లెక్కించేందుకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఐదేళ్లపాటు కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్