Jacinda Ardern: ఒమిక్రాన్ ఆంక్షలు.. వివాహాన్ని రద్దు చేసుకున్న న్యూజిలాండ్ ప్రధాని
న్యూజిలాండ్లో తాజాగా ఒమిక్రాన్ కలకలం రేగింది. దీంతో ఈ కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు ఇక్కడి ప్రభుత్వం మరోసారి కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ నిబంధనల నేపథ్యంలో తన వివాహ వేడుకను రద్దు చేసుకున్నట్లు దేశ ప్రధాని జసిండా...
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో తాజాగా ఒమిక్రాన్ కలకలం రేగింది. దీంతో ఈ కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు ఇక్కడి ప్రభుత్వం మరోసారి కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ నిబంధనల నేపథ్యంలో తన వివాహ వేడుకను కూడా రద్దు చేసుకున్నట్లు దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పట్లో తన పెళ్లి వేడుక జరగదంటూ ఆదివారం విలేకరులతో చెప్పారు. మహమ్మారి కారణంగా ఇటువంటి అనుభవాలు ఎదుర్కొన్న అనేకమంది న్యూజిలాండ్వాసుల జాబితాలో తానూ చేరానని చెప్పుకొచ్చారు. పెళ్లి వాయిదాపై ఎలా భావిస్తున్నట్లు విలేకరులు ప్రశ్నించగా.. ‘జీవితం అంటే అలానే ఉంటుంది’ అంటూ బదులిచ్చారు. ఆర్డెర్న్, ఆమె భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్ ఇప్పటివరకు తమ వివాహ తేదీని ప్రకటించలేదు.. కానీ, త్వరలోనే ఈ వేడుక కోసం ఏర్పాట్లు చేసినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.
‘కొవిడ్ నేపథ్యంలో గడ్డు పరిస్థితులు అనుభవించిన వేలాది మంది న్యూజిలాండ్వాసులకు నేనేమీ భిన్నం కాదు. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే.. మనకు ఇష్టమైనవారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారిపక్కన ఉండలేకపోవడమే. ఇది చాలా బాధను కలిగిస్తుంది’ అని జసిండా తెలిపారు. న్యూజిలాండ్లో ఇటీవల ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ కుటుంబంలో తొమ్మిది మందికి ఒమిక్రాన్ సోకింది. వారు ప్రయాణించిన విమానంలో ఫ్లైట్ అటెండెంట్కూ పాజిటివ్గా తేలడంతో.. అధికారులు స్థానికంగా మరోసారి ఆంక్షలు కఠినతరం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి వీటిని అమల్లోకి తెచ్చారు. ఈ క్రమంలో బార్లు, రెస్ట్రాంట్లతోపాటు వివాహా వేడుకల వద్ద జనసంఖ్యపై పరిమితులు విధించారు. దీంతోపాటు మాస్కులను తప్పనిసరి చేశారు. వచ్చే నెలాఖరు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్