Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని అనూహ్య ప్రకటన.. రాజీనామా చేసిన జెసిండా
రాజీనామా ప్రకటించి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. తన ప్రకటన వెనక ఎలాంటి రహస్యం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్(New Zealand) ప్రధాని జెసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) అనూహ్య ప్రకటన చేశారు. రాజీనామా ప్రకటించి షాక్ ఇచ్చారు. ప్రగతిశీల పాలనకు పేరుపొందిన ఆమె.. ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. కరోనా కల్లోలం, అత్యంత దారుణస్థాయిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇలాంటి ఆమె..తన రాజీనామాకు ఇదే తగిన సమయమని వెల్లడించారు.
‘నేనొక మనిషిని. మనం చేయగలినంత కాలం చేస్తాం. తర్వాత సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైంది. అయితే, అది అత్యంత సవాలుతో కూడుకున్న పని. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు కొనసాగలేం. మీరు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తా..? కాదా..? అనేది తెలుసుకోవడం కూడా ఒక బాధ్యతే. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావించడం వల్ల నేను ఈ పదవిని వీడటం లేదు. ఎందుకంటే మనం విజయం సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ లేబర్ పార్టీ సభ్యులతో మాట్లాడారు. తన రాజీనామా వెనక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించారు.
2017లో ఆమె మొదటిసారి న్యూజిలాండ్ ప్రధానిగా నియమితులయ్యారు. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఇక 2020లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని విజయతీరాలకు నడిపించారు. తాజాగా రాజీనామా ప్రకటించిన ఆమె.. ఫిబ్రవరి ఏడు వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14న జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. మరోపక్క ఈ సమయం వరకు కొత్త ప్రధానిని జనవరి 22న ఎన్నుకోనున్నారు.
ప్రస్తుతం ఆమె ప్రభుత్వం ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయినట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే.. 2019లో క్రైస్ట్చర్చ్ నగరంలోని మసీదుపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె వ్యహరించిన తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఆ ఘటనలో 51 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డారు. ఆ హింసాకాండకు ఆమె ఎంతగానో చలించిపోయారు. అలాగే ప్రకృతి విపత్తు, కరోనా కల్లోలాన్ని ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్