India-China Talks: భారత్- చైనా చర్చల్లో పురోగతి లేదు.. ఉమ్మడి ప్రకటన విడుదల
తూర్పు లద్దాఖ్లో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం భారత్- చైనా మధ్య నిర్వహించిన 14వ కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో పురోగతి రాలేదని ఇరుపక్షాలు గురువారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే.. దగ్గరి సంబంధాలు కొనసాగించాలని, ఈ సమస్యలపై...
ఇంటర్నెట్ డెస్క్: తూర్పు లద్దాఖ్లో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం భారత్- చైనా మధ్య నిర్వహించిన 14వ కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో పురోగతి రాలేదని ఇరుపక్షాలు గురువారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే.. దగ్గరి సంబంధాలు కొనసాగించాలని, ఈ సమస్యలపై పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం మున్ముందూ చర్చలు జరపాలని అంగీకరించాయి. ఈ విడత చర్చల్లో తూర్పు లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్య పరిష్కారం కాగలదని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బుధవారం చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చర్చల్లో పురోగతి లేదంటూ తాజాగా ప్రకటన వెలువడటం గమనార్హం.
‘ఈ సమావేశానికి ఇరుపక్షాల రక్షణ, విదేశాంగశాఖల ప్రతినిధులు హాజరయ్యారు. పశ్చిమ సెక్టార్(లద్దాఖ్ సరిహద్దు)లో ఎల్ఏసీ వెంబడి సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన, లోతైన అభిప్రాయాలను పంచుకున్నారు’ అని ఆ ప్రకటనలో భారత్, చైనా పేర్కొన్నాయి. ఈ క్రమంలో వారివారి ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను అనుసరించాలని, మిగిలిన సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా కృషి చేయాలని అంగీకరించాయి. తాజా చర్చలు.. లద్దాఖ్ సెక్టార్లో ఎల్ఏసీ వెంబడి ప్రశాంతతను పునరుద్ధరించడానికి, ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సాధించడానికి సహాయపడతాయని భావిస్తున్నట్లు చెప్పాయి. ఈ క్రమంలో తదుపరి రౌండ్ చర్చలు వీలైనంత త్వరగా జరగాలని ఆకాంక్షించాయి. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్లో జరిగిన 13వ రౌండ్ చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉమ్మడి ప్రకటన కూడా రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?