Sri Lanka: దేశంలో ఆర్థిక వ్యవస్థే లేదు.. ఇంకా సంస్కరణలతో ఏం ప్రయోజనం..!
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలతో ప్రస్తుత దుస్థితి నుంచి బయటపడటం సాధ్యం కాదని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు.
కొలంబో: ఆహార, ఆర్థిక సంక్షోభాలను (Economic Crisis) ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ఇటీవలే రాజకీయ సుస్థిరత నెలకొంది. అయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆర్థిక సంస్కరణలు (Reforms) చేపట్టాలనే వాదన అక్కడ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక వ్యవస్థే లేనప్పుడు.. సంస్కరణలతో ప్రయోజనం లేదని అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు. నూతన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని చెప్పారు.
శ్రీలంక ఆర్థిక సదస్సు 2022లో పాల్గొని మాట్లాడిన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe).. కాలం చెల్లిన ప్రస్తుత ఆర్థిక విధానాలతో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల దేశ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించడాన్ని ప్రస్తావించిన ఆయన.. ఆర్థిక సంస్కరణలు చేయడం ప్రస్తుత పరిస్థితులకు విరుగుడు కాదన్నారు. సంస్కరణలు చేపట్టినా ప్రయోజనం లేదని, అత్యంత బలహీనమైన ప్రస్తుత విధానాలతో ముందుకెళ్తే అవి మళ్లీ దెబ్బతీస్తాయని అన్నారు. అందుకే కొత్త ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తామని.. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు.
దేశ స్వాతంత్ర్యానంతరం ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంకను విదేశీ మారక నిల్వల కొరత వేధిస్తోంది. దీంతో దివాలా అంచుకు చేరిన ఆ దేశం.. అంతర్జాతీయ రుణాలు చెల్లించలేమని ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించింది. ఇలా దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత నిత్యవసర వస్తువుల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఇంధనం, ఔషధాలు, ఎరువుల కోసం శ్రీలంక పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి. -
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..