Ukraine Crisis: ఉక్రెయిన్ చిన్నారుల కోసం నోబెల్ వేలం.. రికార్డు ధరకు అమ్ముడైన పురస్కారం..!
నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డు స్థాయి ధర దక్కించుకుంది. 103.5 మిలియన్ డాలర్ల గరిష్ఠ మొత్తానికి అమ్ముడైంది. ఉక్రెయిన్ శరణార్థి చిన్నారుల సహాయార్థం ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అమెరికాకు చెందిన హెరిటేజ్ ఆక్షన్స్ వేలానికి ఉంచగా ఈ రికార్డు నమోదైంది.
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డు స్థాయి ధర దక్కించుకుంది. 103.5 మిలియన్ డాలర్ల గరిష్ఠ మొత్తానికి అమ్ముడైంది. ఉక్రెయిన్ శరణార్థి చిన్నారుల సహాయార్థం ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అమెరికాకు చెందిన హెరిటేజ్ ఆక్షన్స్ వేలానికి ఉంచగా ఈ రికార్డు నమోదైంది.
రష్యాకు చెందిన పాత్రికేయుడు దిమిత్రి మురతోవ్.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 2021 ఏడాదిగానూ ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. రష్యన్ పత్రిక నొవయా గెజెటాకు ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నారు. ఆ దేశ రాజకీయ, సామాజిక వ్యవహరాలపై విమర్శనాత్మక, పరిశోధనాత్మక కథనాలు వెలువరించే స్వతంత్ర వార్తా సంస్థ అది. తన స్వదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణకు చేస్తున్నందుకుగానూ మురతోవ్కు ఈ అవార్డు దక్కింది. కాగా, ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న దురాక్రమణ ఎంతోమంది చిన్నారులను శరణార్థులుగా మార్చివేసింది. వారి సహాయార్థం మురతోవ్ తన నోబెల్ బహుమతిని వేలానికి ఉంచారు. ఈ వేలంలో నోబెల్ బహుమతి 103.5 మిలియన్ల డాలర్ల ధర పలికింది. అయితే దీనిని దక్కించుకుంది ఎవరో మాత్రం వేలం సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ వెల్లడించలేదు. 2014లో నోబెల్ పురస్కారానికి వేలంలో 4.76 మిలియన్ల డాలర్లు వచ్చాయి. ఇప్పటివరకు అదే అత్యధికం.
మూడువారాలుగా జరగుతోన్న ఈ వేలం ప్రపంచ శరణార్థుల దినోత్సవం నాడు(నిన్న) ముగిసింది. దీనిపై మురతోవ్ మాట్లాడుతూ..‘శరణార్థి చిన్నారులకు సంఘీభావంగా పెద్ద మొత్తం ధర లభిస్తుందని అనుకున్నా. కానీ, ఈ స్థాయిలో మాత్రం ఊహించలేదు’ అని ఆనందం వ్యక్తం చేశారు. వేలం సంస్థ కూడా ఇదే తరహాలో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా, ఈ మొత్తం ఐరాస అనుబంధ సంస్థ యూనిసెఫ్కు చేరింది. ఈ విషయాన్ని యునిసెఫ్ ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే.. 2014లో రష్యా.. క్రిమియాను ఆక్రమించడం, ప్రస్తుతం ఉక్రెయిన్పై జరుపుతోన్న దాడిని మురతోవ్ తీవ్రంగా ఖండిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.