North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
ఐరాస ఆంక్షలను ఉల్లంఘించి అణ్వాయుధ పరీక్షలు చేస్తోన్న ఉత్తరకొరియా (North Korea).. ఆ నిధుల కోసం సైబర్ మోసాలకు పాల్పడుతోంది. గతేడాది ఆ దేశ హ్యాకర్లు వేల కోట్ల విలువైన క్రిప్టోలను దోచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అటు ఐక్యరాజ్య సమితి ఆంక్షలు.. ఇటు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా.. ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్ (Kim Jong Un) మాత్రం అణ్వాయుధ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మరి తినడానికే తిండి లేనప్పుడు అణు పరీక్షలకు డబ్బెలా.. అదంతా కిమ్ చెంతన ఉన్న జాతిరత్నాల్లాంటి హ్యాకర్ల పుణ్యమే మరి..! బ్లాక్చైన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టో ఎక్స్ఛేంజిల్లోకి ఉత్తరకొరియా హ్యాకర్లు (Hackers) చొరబడి వేల కోట్లను తస్కరిస్తున్నారు. అలా గతేడాది వారి కొల్లగొట్టిన మొత్తం.. 1.7 బిలియన్ డాలర్లు(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13.9వేల కోట్లు). ఈ మేరకు డిజిటల్ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ ‘చైన్ ఎనాలసిస్’ వెల్లడించింది.
ఉత్తరకొరియాకు చెందిన హ్యాకర్లు 2022లో 1.7 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో (Crypto Currency)లను కాజేసినట్లు చైన్ ఎనాలసిస్ నివేదిక వెల్లడించింది. అంతక్రితం ఏడాది దోచేసిన 429 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇక గతేడాది మొత్తం 3.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలను హ్యాకర్లు దోపిడీ చేయగా.. ఇందులో 44శాతం ఉత్తరకొరియా నేరగాళ్లు చేసినవే అని సంస్థ తెలిపింది. చైనా (China), నాన్-ఫంగిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) బ్రోకర్ల ద్వారా ఈ హ్యాకర్లు క్రిప్టోలను దొంగిలిస్తున్నట్లు చైన్ ఎనాలసిస్ పేర్కొంది.
అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తరకొరియా.. తన అణ్వాయుధ ప్రయోగాలకు నిధుల కోసం క్రిప్టో నేరాలకు పాల్పడుతోంది. గతేడాది హారిజన్ బ్రిడ్జ్ అనే బ్లాక్చైన్ నెట్వర్క్లో 100 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలు చోరీకి గురయ్యాయి. ఇది ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ పనే అని గత నెల అమెరికాకు చెందిన ఎఫ్బీఐ (FBI) ధ్రువీకరించింది. ఉ.కొరియాకు డాలర్లు చేరకుండా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో కిమ్.. క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టారు. అయితే, వాటిని తయారు చేసుకునే ఆర్థిక స్తోమత లేక ఇలా మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు వెల్లడించారు. ఆ సొమ్ముతో అణ్వాయుధాలు, క్షిపణులను తయారు చేస్తోందని ఐరాస పరిశోధక బృందాలు గతంలోనే వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.