North Korea: ఉత్తర కొరియా దూకుడు.. మూడు రోజుల్లో రెండో క్షిపణి ప్రయోగం
క్షిపణి ప్రయోగాల్లో ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా శనివారం జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఓ బాలిస్టిక్ క్షిపణి(ఎస్ఎల్బీఎం)ని పరీక్షించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. కిమ్ ప్రభుత్వం అణు పరీక్షలకు సన్నద్ధమవుతోందన్న...
సియోల్: క్షిపణి ప్రయోగాల్లో ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా శనివారం జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఓ బాలిస్టిక్ క్షిపణి(ఎస్ఎల్బీఎం)ని ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. కిమ్ ప్రభుత్వం అణు పరీక్షలకు సన్నద్ధమవుతోందన్న అమెరికా హెచ్చరికల నడుమ.. మూడు రోజుల వ్యవధిలోనే రెండో క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం. 2022 మొదటినుంచే ఈ దేశం క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 2017 తర్వాత మొదటిసారి పరీక్షించిన ఫుల్ రేంజ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సహా 15 పరీక్షలు నిర్వహించింది.
దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యున్ సుక్-యోల్గా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు ఈ ప్రయోగం జరపడం చర్చనీయాంశంగా మారింది. ‘‘ఎస్ఎల్బీఎం’గా భావిస్తున్న ఓ స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా తన ప్రధాన నౌకాదళ స్థావరం సిన్పో సమీపంలోని సాగర జలాల నుంచి ప్రయోగించినట్లు తమ సైన్యం గుర్తించింది’ అని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సిన్పోలో జలాంతర్గాములు ఉన్నట్లు గతంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలు బయటకు వచ్చాయి. జపాన్ కోస్ట్ గార్డ్ సైతం.. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. తమ నౌకలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు.. ఉత్తర కొరియా అతి త్వరలోనే అణు పరీక్షలను పునఃప్రారంభించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరించింది. ‘ప్యాంగ్యాంగ్ తన అణు పరీక్ష కోసం ‘పుంగ్గే-రి’ టెస్ట్ సైట్ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే అక్కడ పరీక్షించడానికి సిద్ధంగా ఉంది’ అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి జలీనా పోర్టర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెలాఖరులో జపాన్, దక్షిణ కొరియాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో.. యున్ సుక్-యోల్ ప్రమాణ స్వీకారం సమయంలో లేదా బైడెన్ పర్యటన సందర్భంగా ఈ పరీక్ష జరగొచ్చని అంచనా వేస్తున్నారు. 2017 వరకు ఉత్తర కొరియా ఆరుసార్లు అణు పరీక్షలు నిర్వహించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు