North Korea: కిమ్ రాజ్యంలోకి కరోనా తొలి అడుగు..!
కరోనా మహమ్మారి ముందు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఓడిపోయారు. రెండేళ్లపాటు దేశంలోకి వైరస్ రాకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
తీవ్రస్థాయి జాతీయ అత్యయిక పరిస్థితి విధించిన కిమ్ ప్రభుత్వం
ప్యాంగ్యాంగ్: కరోనా మహమ్మారి ముందు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఓడిపోయారు. రెండేళ్లపాటు దేశంలోకి వైరస్ రాకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తమ దేశంలో కరోనా అడుగుపెట్టిందని చివరకు కిమ్ అంగీకరించాల్సి వచ్చింది..! తాజాగా ఉత్తరకొరియా తొలి కొవిడ్-19 కేసును ధ్రువీకరించింది. దాంతో అక్కడి ప్రభుత్వం ‘తీవ్రస్థాయి జాతీయ అత్యయిక పరిస్థితి’ని విధించింది. దేశంలో బయటపడిన ఈ వైరస్ను పారదోలేందుకు కిమ్ ప్రతిజ్ఞ చేసినట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది.
రాజధాని నగరం ప్యాంగ్యాంగ్లో జ్వరంతో బాధపడుతోన్న రోగుల నుంచి తీసిన నమూనాలను పరీక్షించగా.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు తెలిపారు. అయితే, ఇప్పుడు అక్కడ ఏ స్థాయిలో కరోనా కేసులు ఉన్నాయో స్పష్టమైన సమాచారం లేదు. రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటి వరకు టీకాలు అందలేదని తెలుస్తోంది. కటిక పేదరికాన్ని అనుభవిస్తోన్న ఆ దేశ వైద్య వ్యవస్థ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సమయంలో అక్కడ వైరస్ విజృంభిస్తే.. క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితిపై కిమ్ ఉన్నతాధికారులతో క్రైసిస్ పొలిట్బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు చేపడతామని ప్రకటించారు. ‘అత్యల్ప సమయంలో మూలాన్ని గుర్తించి, నివారించడమే లక్ష్యమని కిమ్ వెల్లడించారు. ప్రజలకున్న రాజకీయ అవగాహన వల్ల అత్యవసర పరిస్థితిని అధిగమిస్తామని, ఎమర్జెన్సీ క్వారంటైన్ ప్రాజెక్టులో విజయం సాధిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కఠిన సరిహద్దు నియంత్రణ చర్యలు, లాక్డౌన్కు పిలుపునిచ్చారు’ అంటూ ఆ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా చుట్టుపక్క దేశాలు కరోనా విజృంభణతో ఇబ్బందిపడుతున్నాయి. అధిక వ్యాక్సినేషన్ రేటు ఉన్న దక్షిణ కొరియా ఈ మార్చిలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఉక్కిరిబిక్కిరైంది. కేసులు దిగిరావడంతో ఇటీవలే దాదాపు అన్ని నిబంధనలను సడలించింది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో.. ఒమిక్రాన్ వేరియంట్ దశల వారీగా విజృంభిస్తోంది. ఇటీవల ఆర్థిక రాజధాని షాంఘై సహా పలు నగరాలు కరోనా విజృంభణ, ఆంక్షలతో ఎంతగా ఇబ్బంది పడుతున్నాయో చూస్తున్నాం. ఈ దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్లు అందాయి. అదే ఉత్తర కొరియా విషయానికొస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకాలు ఇస్తామని చెప్పినా వద్దనుకుంది. చైనా, రష్యాకు కూడా నో చెప్పింది. ఇకపోతే.. ప్యాంగ్యాంగ్, దానికి సమీప ప్రాంతాలు రెండురోజుల పాటు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయని ఓ వార్త సంస్థ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!