North Korea: కిమ్ రాజ్యంలో మరో దారుణం.. 2 ఏళ్ల చిన్నారికి జీవితఖైదు
ఉత్తరకొరియా (North Korea)లో ఓ రెండేళ్ల చిన్నారిని అరెస్టు చేసి జీవిత ఖైదు విధించడం సంచలనం రేపుతోంది. కిమ్ (Kim Jong Un) రాజ్యంలో జరుగుతోన్న అకృత్యాలపై అమెరికా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రాజ్యంలో దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న నేరాలకే అక్కడ ప్రాణాలు తీసే శిక్షలు విధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కిమ్ పాలనలో అకృత్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. క్రైస్తవులపై ఉత్తరకొరియా ప్రభుత్వ ఆగడాల గురించి తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. క్రైస్తవులు తమ పవిత్ర గ్రంథంతో కన్పిస్తే అక్కడ కఠిన శిక్షలు విధిస్తున్నారట. అలా ఓ రెండేళ్ల చిన్నారికి జీవితఖైదు విధించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022’ పేరుతో అమెరికా (USA) విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి ప్రజలపై పాల్పడుతున్న దారుణాలను పేర్కొంది. ఇతర మతాల వారి పట్ల కిమ్ రాజ్యం అమానవీయంగా ప్రవర్తిస్తోందని తెలిపింది. ఇప్పటివరకు అక్కడ దాదాపు 70వేల మంది క్రైస్తవులను ఖైదు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో 2009లో ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారి సహా కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు విధించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
ఇలా మతపరమైన కార్యకలాపాలకు యత్నించినందుకు గానూ అనేక మంది క్రైస్తవులను అరెస్టు చేసి పొలిటికల్ జైలు శిబిరాలకు తరలించారని నివేదిక తెలిపింది. అయితే, ఆ శిబిరాల్లో ఖైదీలు అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. వారిని శారీరకంగా హింసించడం, జీవించే హక్కును తిరస్కరించడం, పారదర్శక విచారణ జరపకపోవడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి అకృత్యాలు ఆ శిబిరాల్లో జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.
2021 డిసెంబరులో కొరియా ఫ్యూచర్ అనే ఓ లాభాపేక్ష లేని సంస్థ కూడా కిమ్ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది. మతస్వేచ్ఛను కోరుకునే వారు అత్యంత తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. అత్యాచారం, బలవంతంగా అవయవాల దోపిడీ, హత్యలు, గూఢచర్యానికి పంపించడం వంటి దారుణాలకు ఉ.కొరియా అధికారులు పాల్పడుతున్నారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి