Kim Jong: కిమ్కు మళ్లీ కోపమొచ్చింది... ఇంగ్లీష్ సినిమాలు చూస్తే జైలుకు పంపిస్తానన్నాడు..
ప్రపంచంలో అందరు పిల్లల్లా వారు సినిమాలు చూడలేరు. వినోదాత్మకమైన ఇతర దేశాల సినిమాలు చూస్తే నార్త్ కొరియాలో ఏకంగా వారిని జైలుకు పంపిస్తారు.
ప్యొంగ్యాంగ్: ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ విచిత్ర పాలన అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రూరత్వం రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతుండటంతో ఉత్తర కొరియా వాసులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి హాలీవుడ్ సినిమాలపై పడింది. హాలీవుడ్ సినిమాలు చూసి ఎవరైనా ప్రభావితమై తిరుగుబాటు లేవదీస్తారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఏకంగా హాలీవుడ్ సినిమాలు లేదా విదేశీ సినిమాలను ఇంట్లో చూస్తూ దొరికిపోతే ఆ పిల్లల తల్లిదండ్రులను ఏకంగా జైలుకు పంపిస్తామని ప్రకటించారు. గతంలో ఆ సినిమాలు చూస్తూ దొరికితే తీవ్రంగా హెచ్చరించి విడిచిపెట్టేవారు. అయితే పాశ్చాత్య విధానాలు దేశంపై పడకూడదన్న కఠిన నియమాల్లో భాగంగా తాజా ఆదేశాలు వెలువరించడం గమనార్హం.
దొరికితే మొదట కార్మిక శిబిరాలకు..
మొదట సినిమాలు చూస్తూ దొరికిపోతే తల్లిదండ్రులను కార్మిక శిబిరాలకు తరలిస్తారు. అక్కడ ఆరు నెలల పాటు వారు ఉండాలి. వారి పిల్లలకు మాత్రం ఐదేళ్లు శిక్ష విధించి శిబిరాలకు పంపిస్తారు. పిల్లలకు వారి తల్లిదండ్రులు ఉత్తర కొరియా విశిష్టత గురించి తెలియజేయాలి లేకపోతే సామ్యవాద వ్యతిరేకులుగా మారే ప్రమాదముందని అధికారులు పేర్కొన్నారు.
బాలలను సైతం ఉపేక్షించరు..
గతంలో దక్షిణ కొరియా సినిమాల క్యాసెట్లను సరఫరాచేస్తూ ప్రదర్శించిన ఇద్దరు బాలలకు మరణశిక్ష విధించినట్టు దక్షిణ కొరియా మీడియాసంస్థలు పేర్కొన్నాయి. గత నెలలో ఎవరైనా అశ్లీల చిత్రాల వీడియోలను వీక్షిస్తున్నట్టు సమాచారమందితే వారిని కాల్చిచంపాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ప్రజలు తమకు ఇష్టమైన ఇతర దేశాల సినిమాలు చూడలేక ఉసూరుమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!