North Korea: కిమ్ రాజ్యంలో ఒక్కరోజే 2.7లక్షల కరోనా కేసులు..!
ఉత్తర కొరియాలో కొవిడ్ విజృంభణ తీవ్ర స్థాయికి చేరినట్లే కన్పిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు ఏకంగా లక్షల్లో ఉండటం వైరస్ ఉద్ధృతిని అద్దం పడుతోంది. భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తరకొరియాకు లేకపోవడంతో..
సియోల్: ఉత్తర కొరియాలో కొవిడ్ విజృంభణ తీవ్ర స్థాయికి చేరినట్లే కన్పిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు ఏకంగా లక్షల్లో ఉండటం వైరస్ ఉద్ధృతికి అద్దం పడుతోంది. భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తరకొరియాకు లేకపోవడంతో.. లక్షణాల ఆధారంగానే కరోనాగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 2,69,510 మంది తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియా వెల్లడించింది. ఇక జ్వరం కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరకొరియాలో ఏప్రిల్ చివరి నుంచి ఈ తీవ్ర జ్వరం వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు 14.8లక్షల మంది జ్వరం బారిన పడగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉత్తర కొరియా యాంటీ వైరస్ హెడ్క్వార్టర్స్ వెల్లడించింది. అయితే మరణాల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాధితుల్లో ఎంతమందికి కొవిడ్ పాజిటివ్ అనేది ప్రభుత్వం వెల్లడించనప్పటికీ.. దాదాపు అందరికీ కొవిడ్ సోకి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో ఇప్పటివరకు సగం మంది కోలుకోగా.. ఇంకా 6.63లక్షల మంది క్వారంటైన్లో ఉన్నట్లు మీడియా తెలిపింది.
భారీ ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉత్తర కొరియాకు లేకపోవడంతో ఎంతమందికి కరోనా సోకిందనే విషయంపై స్పష్టత రావట్లేదు. దీంతో కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని షెల్టర్లలో ఐసోలేషన్లో ఉంచారు. మరోవైపు, దేశంలో ఎవరూ వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఆరోగ్య వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో కరోనా పెను ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉత్తర కొరియాలో వైరస్ మరణాలు రికార్డు స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన వ్యూహాలను అమలు చేయాలని దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు సూచించారు. ఔషధాల పంపిణీకి సైన్యాన్ని రంగంలోకి దించారు. జ్వరంతో ఉన్నవారికి గుర్తించి క్వారంటైన్కు పంపేందుకు ఆరోగ్య అధికారులు, టీచర్లు, వైద్య విద్యార్థులను ఇంటింటికీ పంపుతున్నారు. అయితే వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్లను తీసుకోవడంపై కిమ్ నుంచి ఎలాంటి ప్రకటన గానీ, అభ్యర్థనలు గానీ రాకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!