Covid Crisis: ఉత్తరకొరియాలో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే 2.7 లక్షల మందికి జ్వరాలు
ఉత్తర కొరియాలో కరోనా విశ్వరూరం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. నిత్యం లక్షలమందిలో జ్వరాలు వెలుగు చూస్తున్నాయి.
14లక్షల మందిలో కొవిడ్ లక్షణాలు.. 56 మంది మృతి
సియోల్: ఉత్తర కొరియాలో కరోనా విశ్వరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. నిత్యం లక్షలమందిలో జ్వరాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లోనే 2లక్షల 69వేల మంది జ్వరం బారినపడినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. మరో ఆరుగురు మృత్యువాత పడడంతో కొవిడ్ లక్షణాలతో మరణించిన వారిసంఖ్య 56కు చేరినట్లు తెలిపింది. ప్రజలందరికీ కొవిడ్ నిర్ధారణ చేయనప్పటికీ అవన్నీ కొవిడ్ అనుమానిత కేసులుగానే భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కిమ్.. సైన్యాన్ని రంగంలోకి దించి బాధితులకు ఔషధాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
రెండున్నరేళ్లపాటు కరోనా వైరస్ను దరిచేరనివ్వని ఉత్తర కొరియాలో గత కొన్ని రోజులుగా వైరస్ విజృంభణ మొదలుపెట్టింది. నిత్యం రెండు, మూడు లక్షల మంది జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. అయితే, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసే కిట్లు లేకపోవడంతో లక్షణాలున్న వారిని ఇళ్లకే పరిమితమై జాగ్రత్తగా ఉండమని సూచిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 14లక్షల మంది జ్వరం బారినపడగా వారిలో ప్రస్తుతం 6.6 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నట్లు వెల్లడించింది. 24 గంటల పాటు మిలటరీ అందుబాటులో ఉంచి ప్రజలకు అవసరమైన ఔషధాలను అందిస్తున్నట్లు తెలిపింది.
కొవిడ్ను ఎదుర్కొనే వ్యవస్థ శూన్యం..
2.6కోట్ల జనాభా కలిగిన ఉత్తర కొరియాలో కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యవస్థలు శూన్యమనే చెప్పవచ్చు. పేదరికం, పోషకాహార లోపం, ప్రజారోగ్య సదుపాయాల లేమి, సరైన ఔషధాలు లేని ఉత్తర కొరియాలో కరోనా వ్యాక్సిన్ అనే మాటే లేదు. ఇప్పటివరకు అక్కడ కనీసం ఒక్కరికైనా కొవిడ్ వ్యాక్సిన్ అందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కరోనా మరణాలపై వాస్తవాలను వెల్లడించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా తీవ్ర వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉపద్రవమేనన్న కిమ్..
దేశంలో ఊహించని విధంగా విరుచుకుపడిన కరోనా వైరస్ ఉద్ధృతిపై స్పందించిన ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. భారీ ఉపద్రవం ముంచుకొచ్చిందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఓవైపు లక్షల మంది కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రజలను హెచ్చరిస్తూనే వ్యవసాయ, పారిశ్రామిక, నిర్మాణ రంగంలో పనిచేసుకోవచ్చని సూచించారు. మరోవైపు ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజలు శుభ్రత పాటించాలని పేర్కొంటూ అధికారిక మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు చెబుతూనే కొవిడ్ ఉద్ధృతిపై వైద్యనిపుణులతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరుణంలో ఉత్తర కొరియాకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పలు దేశాలు ముందుకు వచ్చినప్పటికీ కిమ్ జోంగ్ ఉన్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె