North Korea: విదేశీ వస్తువులను తాకడం వల్లే.. మా దేశంలో కరోనా..!
తన దేశంలో కొవిడ్ వ్యాప్తికి విదేశీ వస్తువులు కారణమంటూ దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా నిందలు వేసింది.
దక్షిణ కొరియాపై నిందలు వేసిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: తమ దేశంలో కొవిడ్(Covid-19) వ్యాప్తికి విదేశీ వస్తువులు కారణమంటూ దక్షిణ కొరియా(South Korea)పై ఉత్తర కొరియా(North Korea) నిందలు వేసింది. విదేశీ వస్తువులు తాకడం వల్లే తమవద్ద మొదటిసారి కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైందని ఆరోపించింది. తమ ఆరోపణలు నిరూపించే విధంగా దర్యాప్తు వివరాలను ప్రకటించింది. ‘ఉత్తర కొరియా ప్రజలు సరిహద్దుల వెంట గాలి, వాతావరణం, బెలూన్ల ద్వారా వచ్చే విదేశీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించింది.
దేశ ఆగ్నేయ ప్రాంతంలో కుమ్గాంగ్ పర్వత ప్రాంతంలోని ప్రజలు గుర్తుతెలియని వస్తువులను తాకడం వల్ల 18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారికి జ్వరం లక్షణాలు కనిపించాయని పేర్కొంది. ఆ తర్వాత వారికి కరోనా పాజిటివ్గా తేలిందని తెలిపింది. అక్కడి ఇఫోరి ప్రాంతం నుంచి ఏప్రిల్ మధ్యలో రాజధానికి వచ్చిన అనేక మందిలో జ్వరం ఉన్నట్లు గుర్తించామని, వారి రాకపోకలతో దేశంలో అనూహ్యంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. అయితే ఏప్రిల్ మధ్య వరకు దేశంలో వచ్చిన జ్వరాలకు ఇతర వ్యాధులు కారణమని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. అయితే అవేంటో మాత్రం వివరించలేదు.
ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా ఫిరాయింపుదారులు, కార్యకర్తలు రెండు దేశాల సరిహద్దుల వెంబడి దశాబ్దాలుగా బెలూన్లు ఎగరవేస్తుంటారు. వాటి ద్వారా కరపత్రాలు, మానవతా సహాయాన్ని అందిస్తుంటారు. అయితే భద్రతా కారణాలతో దక్షిణ కొరియా మునుపటి ప్రభుత్వం ఈ చర్యలపై నిషేధం విధించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బెలూన్ల ఎగరవేత కార్యకలాపాలు మళ్లీ అడపాదడపా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విమర్శలు వచ్చాయి.
కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో 2020 నుంచి ఉత్తర కొరియా సరిహద్దు వద్ద కఠిన ఆంక్షలు అమలు చేసింది. రెండేళ్ల పాటు ఒక్క కేసూ రాలేదన్న ఆ దేశం.. ఈ మేలో మొదటి కేసు గురించి ప్రకటించింది. తమ దేశంలో మిస్టరీ జ్వరాలు వ్యాపిస్తున్నాయని పేర్కొంది. వైద్య సదుపాయాలు, తగిన టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో ఆ జ్వరం కొవిడ్ అని గుర్తించడం సాధ్యం కావడం లేదని నిపుణులు వెల్లడించారు. కొవిడ్ కేసుల్నే ఉత్తర కొరియా జ్వరాలుగా ప్రకటిస్తుందన్నారు. ఇప్పటివరకూ ఆ దేశంలో 4.74 మిలియన్ల ప్రజలు జ్వరం బారినపడ్డారు. ఇదిలా ఉండగా.. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ప్రజలు కలుషితమైన ఉపరితలాలు లేక వస్తువులను తాకడం ద్వారా కరోనా బారినపడే ప్రమాదం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయితే ఆ వ్యాప్తి అసాధ్యమని మాత్రం చెప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM