
North Korea: కరోనాపై పోరుకు ఉప్పు నీళ్లే ఉత్తమం.. ప్రజలకు కిమ్ ప్రభుత్వం సూచన!
సియోల్: ఉత్తర కొరియాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కొవిడ్ విజృంభణ మొదలై రెండేళ్లు దాటినప్పటికీ తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని గొప్పలు చెప్పుకున్న నియంత దేశం.. ఐరాస నేతృత్వంలోని కొవాక్స్ సహా ఇతర దేశాల నుంచి టీకాల సాయాన్నీ తిరస్కరించింది. కానీ నేడు ఆ దేశం కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదిలా ఉంటే.. కొవిడ్ను అరికట్టేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన సూచన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లు పుక్కిలించాలని, ఇతర వంటింటి చిట్కాలను పాటించాలని సూచించింది.
సంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఆ దేశ అధికార మీడియాకు ఓ మహిళా అధికారి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. తన పిల్లలు రోజుకు రెండు సార్లు ఉప్పు నీటిని పుక్కిలిస్తున్నారని ఆమె తెలిపారు. కరోనా వైరస్పై పోరాడేందుకు వంటింటి చిట్కాల్లోని ఉప్పు నీళ్లు ఉత్తమమైనవి, వాటినే ప్రభుత్వం సిఫార్సు చేస్తున్నట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దాంతో పాటు విల్లో ఆకుల నీటిని రోజుకు మూడుసార్లు తాగాలని సూచించినట్లు వెల్లడించారు. ఈ విల్లో ఆకులను జ్వరం లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ‘ఎలాంటి వ్యాధికైనా సంప్రదాయ చికిత్సలే ఉత్తమం. కొవిడ్పై పోరాటంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. కరోనా అనగానే ముందుగా భయపడ్డాను. కానీ, వైద్యుల సలహాలు పాటించాక పెద్ద విషయమేమీ కాదని భావిస్తున్నా’ అని ఆ మహిళా అధికారి పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.
ఒక్కరోజే 2.32 లక్షల మందికి జ్వరం!
ఉత్తర కొరియాలో 1.7 మిలియన్లకు పైగా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. బుధవారం ఒక్క రోజే 2.32 లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడగా.. ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు పెరిగింది. ప్రస్తుతం 6,91,170 మంది క్వారంటైన్లో ఉన్నారు. అయితే, జ్వరం లక్షణాలను ఇప్పటి వరకు కరోనాగా గుర్తించలేదు కిమ్ ప్రభుత్వం. అధికారికంగా చెప్పిన సంఖ్య కంటే కేసులు మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07-07-2022)
-
World News
Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
-
India News
Dilip Ghosh: ‘కడుపు నిండా తిని ఇఫ్తార్ విందులకు వెళ్తారు’.. దీదీపై భాజపా నేత విమర్శలు
-
Sports News
ధోనీ బర్త్డే స్పెషల్..41 అడుగుల కటౌట్
-
Movies News
Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
-
Crime News
Telangana News: పటాన్చెరు సమీపంలో కోడిపందేలు .. పరారీలో పలువురు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Bhagwant Mann: పంజాబ్ సీఎంకు కాబోయే సతీమణి గురించి తెలుసా?
- పాటకు పట్టం.. కథకు వందనం
- Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Venu Madhav: ఒక్క సీన్ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి
- ధనాధన్ వేళాయె..
- Trending English words:ఈ 10 ట్రెండింగ్ ఇంగ్లిష్ పదాల గురించి తెలుసా?
- Anand Mahindra: మీరు ఎన్నారైనా?.. నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఊహించని రిప్లై