North Korea: క్షిపణి లాంచింగ్ వేళ.. హాలీవుడ్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన కిమ్..!
త్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా.. ప్రపంచానికి తన మార్కును ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఖండాంతర క్షిపణి(హ్వాసాంగ్-17)ని ప్రయోగించి, జపాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేశారు.
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా.. ప్రపంచానికి తన మార్కు స్టైల్ను ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఖండాంతర క్షిపణి(హ్వాసాంగ్-17)ని ప్రయోగించి, జపాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. ఆ లాంచింగ్ వీడియోకు హాలీవుడ్ టచ్ ఇచ్చి, నెట్టింట్లో విడుదల చేయగా, అది కాస్తా వైరల్గా మారింది.
కిమ్ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి.. హాలీవుడ్ నటుడి తరహాలో ఎంట్రీ ఇచ్చారు. పక్కన ఉన్న ఇద్దరు సైనికాధికారులకు సూచనలు చేస్తూ.. క్షిపణి ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఇక ప్రయోగ సమయం సమీపిస్తుండగా.. కిమ్ వాచ్ను తీక్షణంగా గమనిస్తూ.. ఆ తర్వాత స్టైల్గా తన సన్ గ్లాసెస్ను కిందకు దింపి, ఓకే చెప్పారు. ఈ వీడియో నడుస్తున్నంత సేపు, బ్యాగ్రౌండ్లో సస్సెన్స్ థ్రిల్లర్ను తలపించే మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఉత్తర కొరియాకు తన సైనిక సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతోందని ఈ వీడియో శైలిని చూస్తుంటే తెలుస్తోందని ఆ దేశ నిపుణులు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరకొరియా అధినేతలకు సినిమాలంటే ఆస్తకి. గతంలో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ తన దేశంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన డైరెక్టర్, నటిని కిడ్నాప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ దేశ ప్రజలు దారిద్య్రంలో బతుకీడుస్తున్నా.. కిమ్ ప్రభుత్వం సినిమాలపై చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు గుప్పిస్తుంటుంది. అయితే ఆ సినిమా నిర్మాణాల్లో ఎక్కువభాగం కిమ్ కుటుంబాన్ని కీర్తించడానికే కేటాయిస్తారట. కాగా, ఇప్పుడు రూపొందిన వీడియో కూడా హాలీవుడ్, దక్షిణ కొరియా చిత్రాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా ఆ దేశం తమ ప్రజలపై విదేశీ ప్రభావాన్ని అంగీకరించదు. విదేశీ చిత్రాలు చూస్తూ, ఆ తరహా దుస్తులు ధరించిన వారిని శిక్షిస్తుంది. కానీ ప్రస్తుత వీడియోపై మాత్రం ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఇటీవల జరిగిన ప్రయోగాన్ని దక్షిణ కొరియా, జపాన్లు.. ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగంగా భావిస్తున్నాయి. 2017 తర్వాత పూర్తి సామర్థ్యంతో కూడిన అతిపెద్ద ప్రయోగం ఇదేనని అనుమానిస్తున్నాయి. ‘ఈసారి బాలిస్టిక్ క్షిపణి ఆరు వేల కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించింది. ఇది 2017 నవంబరులో ప్రయోగించిన హ్వాసాంగ్-15 ఐసీబీఎం కంటే చాలా ఎక్కువ’ అని జపాన్ మంత్రి ఒనికి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి